Ys Jagan Mohan Reddy : ఎమ్మెల్యేల పరంగా వైసీపీ పార్టీకి తిరుగు లేని బలం ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే పూర్తిగా టీడీపీ ని నిర్వీర్యం చేయడానికి ఆ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలను జగన్ తన పార్టీలోకి చేర్చుకోవడం ఇప్పుడు ఆయన కొంపముంచినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి.
టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరైతే వైసీపీ లోకి రావడం జరిగింది వారి వల్ల వైసీపీలోనే గొడవలు జరుగుతున్నట్లు ఇటీవల కృష్ణా మరియు కొన్ని జిల్లాలలో వివాదాలు బయటపడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కృష్ణా జిల్లా గన్నవరం లో వల్లభనేని వంశీ కి అదేవిధంగా యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య భారీ స్థాయిలో విభేదాలు రావటమే కాక ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో.. మీడియా ముందే రెండు గ్రూపులు కొట్టుకోవడం జరిగాయి.
ఇదే క్రమంలో కోనసీమలో జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా తన నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి చెందిన నాయకులను బహిరంగంగానే విమర్శలు చేయటం మాత్రమే కాక ఇటీవల పంచాయతీ ఎన్నికల సమయం…వైసిపి పార్టీ పేరు చెప్పి బండ బూతులు తిట్టడం తో జగన్ టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలను మరియు అదే విధంగా జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేర్చుకొని తనకి తానుగా గోయి తవ్వుకుంటున్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. పాలనాపరంగా అంతా బాగానే ఉన్నా గాని ఇతర పార్టీల నాయకులను సొంత పార్టీ లోకి ఆహ్వానించడం తో టీడీపీకి చెందిన చాలామంది నేతలు ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ వాళ్లపై అజమాయిషీ చేస్తున్నట్లు సొంత పార్టీ నుండే విమర్శలు వినబడుతున్నాయి.