వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయి 16 నెలలు కావస్తోంది. పరిపాలన పరంగా సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగకుండా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ వస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంక్షేమ పథకాలు కంటిన్యూ చేశారు. అంతా బాగానే ఉన్నా కానీ జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఆయనకు పెద్ద బిగ్గెస్ట్ చాలెంజ్ గా మారినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే వైయస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలలో ఒక నిర్ణయం మూడు రాజధానులు.
ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణం అభివృద్ధి అనేది అంతట జరగాలని. అంతేకాకుండా అమరావతిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గతంలో అవినీతి చేసిందని అనేక ఆరోపణలు చేశారు. దీంతో చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి అంటూ ఒక నివేదిక కూడా అప్పట్లో రెడీ చేయడం జరిగింది. ఈ తరుణంలో మంత్రి వర్గం అందించిన నివేదికలో 4050 ఎకరాలు బినామీ పేర్లతో రాజధాని అమరావతి ప్రాంతంలో టిడిపి అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించడం జరిగింది. ఇదే విషయాన్ని నిండు అసెంబ్లీలో కూడా వైఎస్ జగన్ ప్రస్తావించారు.
ఇటువంటి తరుణంలో ప్రస్తుతం రాష్ట్రంలో రాజధాని విషయంలో రగడ జరుగుతున్న నేపథ్యంలో అవినీతి జరిగితే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న వాదనలు వస్తున్నాయి. మొదటిలో ఏపీ సిఐడి అధికారులు విచారణ చేస్తున్నట్లు అప్పట్లో కొంతమంది బాబు హయాంలో పని చేసిన అధికారులను విచారణ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. తెల్ల రేషన్ కార్డు దారులు అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు కొన్నట్లు వాళ్ళంతా టిడిపి పార్టీకి చెందిన పెద్దపెద్ద నాయకుల బినామీలు అన్నట్లు అప్పట్లో ప్రభుత్వం గుర్తించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
నిజంగా రాజధాని అమరావతి విషయంలో అవినీతి జరిగి ఉంటే జగన్ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తాజాగా విపక్షాల నుండి కామెంట్లు వస్తున్నాయి. నిజంగా ఈ విషయంలో జగన్ చర్యలు తీసుకుంటే బిజెపి అడ్డుపడుతుంది అన్న భయం ఏమైనా ఉందా అనే వాదన మరోపక్క వినబడుతుంది. ముఖ్యంగా అమరావతి రాజధాని రైతులు చేస్తున్న దీక్షకు ఇప్పుడు అరెస్టులు అని ప్రభుత్వం ముందుకు వెళ్తే అగ్గి రాజేసినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోందా…? అనే వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా పదహారు నెలల పాలన తర్వాత అమరావతి రాజధానిలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవటం వైఎస్ జగన్ సర్కార్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ గా ఉంది అని మేధావులు అభిప్రాయపడుతున్నారు.