అమరావతి, మార్చి 18: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియో నివాసంలో వివిధ రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై సోమవారం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జి ఉమెన్ చాందీ తదితర పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులకు ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 136 అసెంబ్లీ, 16లోక్సభ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసి సాయంత్రానికి వెల్లడించే అవకాశం ఉంది. తెలంగాణాలో మిగిలిన తొమ్మిది పార్లమెంట్ స్థానాలకు నేడు అభ్యర్థ్యులను ప్రకటించే అవకాశం ఉంది.