NewsOrbit
రాజ‌కీయాలు

టీటీడీలో రగులుకుంటున్న వార్..! ధర్మారెడ్డికి బ్రేకులు

disagreements between officials in ttd about brahmotsavam

తిరుమల శ్రీవారి బ్రహ్మత్సవాల నిర్వహణ అంశంలో ఉన్నతాధికారుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయా.. అంటే పరిస్థితులు ఔననే అంటున్నాయి. ప్రతిష్టాత్మకమైన టీటీడీ ఈవో పదవి ఇటివల చేతులు మారింది. దాదాపు నాలుగేళ్లుగా ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఇన్ చార్జి ఈవోగా అప్పటివరకూ జేఈఓగా ఉన్న ధర్మారెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఆయన బాధ్యతలు తీసుకుని మొత్తంగా వారం పూర్తయ్యేలోగానే పూర్తిస్థాయి జేఈఓగా జవహర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. నవరాత్ర బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఈ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చేలా చేసాయంటున్నారు.

disagreements between officials in ttd about brahmotsavam
disagreements between officials in ttd about brahmotsavam

భక్తుల మధ్య బ్రహ్మోత్సవాల నిర్వహణపై నిర్ణయం..

ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు రెండుసార్లు వచ్చాయి. ఇటివలే సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసాయి. కరోనా నేపథ్యంలో ఆలయం లోపల ఏకాంతంగా రంగనాయక మండపంలోనే వేడుకలు నిర్వహించారు. బ్రహ్మత్సవాలకు వచ్చే రద్దీ గురించి తెలిసి గత ఈఓ అనిల్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆయన బదిలీ అయ్యారు. ఈనెల 16 నుంచి జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వాహణపై నిర్ణయాన్ని ఇన్ చార్జి ఈఓ ధర్మారెడ్డి తీసుకున్నారు. అయితే.. ధర్మారెడ్డి ఇన్ చార్జి ఈఓనే అయినా.. బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్షలు నిర్వహించారు. భక్తుల మధ్య బ్రహ్మోత్సవాలు నిర్వహంచాలని నిర్ణయం తీసుకున్నారు. భక్తుల కోసం గ్యాలరీల్లో సామాజిక దూరం, ఎడం ఉండేలా మార్కింగులు చేయించారు. పరిమిత సంఖ్యలో భక్తులు, భజన బృందాలను పిలవాలని కూడా అనుకున్నారు.

నిర్ణయం మార్చేసిన ఈవో జవహర్ రెడ్డి..

కరోనా తీవ్రత తగ్గని ప్రస్తుత పరిస్థితుల్లో మాడవీధుల్లో బ్రహ్మోత్సవాల నిర్వహణ సరైంది కాదు. కానీ ధర్మారెడ్డి నేతృత్వంలో నిర్ణయం జరిగింది. కానీ.. ఈలోపు జవహర్ రెడ్డి ఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. వచ్చీ రావడంతోనే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై  సమీక్షించారు. మాడవీధుల్లో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అయితే.. మాడవీధుల్లో బ్రహ్మోత్సవాల నిర్వహణపై వెనక్కు తగ్గారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఏకంతంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ధర్మారెడ్డి నిర్ణయాలకు బ్రేక్ పడింది. ఇప్పుడు ఈ నిర్ణయం ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య దూరం పెంచుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju