NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

 ఒకప్పటి జగన్ ముఖ్య అనుచర ఎమ్మెల్యే..! ఇప్పుడు జగన్‌ని ఇలా అనేసిందేమిటి..??

 

(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్ కశ్చితంగా ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్న వాళ్లలో ముందు వరుసలో ఉన్న ఎమ్మెల్యే కొండా సురేఖ. వైఎస్ రాజశేఖరరెడ్డి వీరవిధేయురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కొండ దంపతులు వైఎస్ మరణం తరువాత జగన్‌కు అంతకంటే వీర విధేయులుగా మారారు. అప్పట్లో శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు.జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుని సంతకాల సేకరణ చేసిన వాళ్లలో వీళ్ళు ముందు వరుసలో ఉన్నారు. అంటే జగన్‌కు ఎవరైనా రాజకీయాల శ్రేయోభిలాషులు ఉన్నారంటే మొదట్లో కొండా సురేఖ దంపతుల పేరే వస్తుంది. అటువంటి కొండా సురేఖ తాజాగా జగన్మోహనరెడ్డి పరిపాలనపైన, జగన్‌కి, కెసిఆర్ మధ్య బంధాలపైన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

konda surekha couple

ఒకప్పుడు జగన్పై రాళ్ళు రువ్వంచిన కేసీఆర్‌కు అదే జగన్‌పై ఇప్పుడు ప్రేమ ఏలా పుట్టింది ? జగన్ ఏలా తీపి అయ్యారు. జగన్ కేసీఆర్ పదే పదే ఎందుకు సమావేశ మవుతున్నారు ! ఇందులోని ఆంతర్యమేమిటి అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొండా సురేఖ కేసీఆర్ – జగన్ దోస్తీపై చేసిన సంచలన వాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.  వైఎస్ హయాంలో వైఎస్ కు సనిహితంగా ఉన్న నాయకులలో కొండా సురేఖ ఒకరుగా ఉన్నారు. వైఎస్ మరణం అనంతరం కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి జగన్ తో కలసి ప్రయాణం చేశారు. తెలంగాణ వరంగల్ కు చెందిన సురేఖ ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కేసీఆర్ చెంతన చేరారు. అక్కడ కూడా తగిన ప్రాధాన్యం దక్కక పోవడంతో తిరిగి సొంత గూడు అయిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ఒక న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కేసీఆర్..జగన్ సత్సంబంధాలపై చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చానీయాంసంగా మారాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌పై అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు కేసీఆర్‌కు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. ఇప్పుడు జగతో పదే పదే అనధికారంగా కలుస్తున్నారు ఎందుకని? అందులోని ఆంతర్యం ఏమిటి? అనే సందేహాన్ని వెలిబుచ్చారు కొండ సురేఖ.

surekha ys jagan

జగన్ పాలన కక్ష సాధింపులా ఉంది !

జగన్ పాలనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనకు చాలా తారతమ్యం ఉందని కోండా సురేఖ వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి పాలన అందిచాల్సింది పోయి తెలుగుదేశం నాయకులపై కక్ష సాధిస్తున్నారని విమర్శించారు. జగన్ పాలనలో కక్ష సాధింపు కనబడుతుందనీ, అది మంచిది కాదనీ కొండా సురేఖ హితువు పలికారు. రాజకీయం ఎన్నకల వరకే ఉండాలి ఆ తరువాత  అందరిని సమానంగా చూడాలని కొండా సురేఖ  పేర్కొన్నారు.

author avatar
Special Bureau

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju