దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మరో పక్క వ్యాక్సిన్ అందుబాటులోకి రావటానికి టైం పట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రస్థాయిలో కరోనా కంట్రోల్ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఎన్ని నిబంధనలు తీసుకొచ్చిన మరోపక్క ప్రజలలో మాత్రం నిర్లక్ష్య వైఖరి స్పష్టం గా కనపడటంతో వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉంది. ప్రభుత్వపరంగా కరోనా వైరస్ పై అవగాహన పెంచుతున్నా గాని ప్రజలు మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తూ వైరస్ క్యారియర్లు గా మారిపోతున్నారు.
ఇదిలా ఉండగా మొదటి నుండి దేశంలో మహారాష్ట్రలో వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ కేసులు విషయంలో గానీ డెత్ రేట్ విషయంలో గాని.. ముందు నుండి మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికీ కూడా అదే రేంజ్ లో వైరస్ వ్యాప్తి ఏ రాష్ట్రంలో ఉంది. ఇటువంటి తరుణంలో అక్కడి ప్రజలు సరైన విధంగా ప్రభుత్వ నిబంధనలు పాటించక పోవడం వల్లే ఈ విధంగా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
ఇటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వైరస్ నియంత్రణకు తీవ్రస్థాయిలో కృషి చేస్తూ ఉంటే మరోపక్క రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. దీనంతటికి కారణం ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించటం అని, ఈసారి నుండి ఎక్కడైనా సోషల్ డిస్టెన్స్ పాటించకపోయినా మాస్కులు కూడా ధరించకపోయినా రెండోసారి రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయడం గ్యారెంటీ అని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఉద్ధవ్ థాకరే హెచ్చరికలు జారీ చేశారు.