జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విశాఖపట్టణం రాజధానిగా గుర్తించడం పట్ల చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా సానుకూలమైన స్పందనే వచ్చింది. కాగా ఈ విషయంలో అధికార లాంఛనాలు ఒక్కటే ఇంక బ్యాలెన్స్ ఉంది. విభజనతో నష్టపోయి హైదరాబాద్ నగరం ఒక్కటే అభివృద్ధి చెందటంతో చాలా వరకు మిగిలి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతినటం జరిగింది. అయితే అలాంటి దెబ్బ మరోసారి రాష్ట్రానికి తగలకూడదని, అభివృద్ధి ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదని జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత గత టీడీపీ ప్రభుత్వం రాజధాని గా అమరావతిని ఎంపిక చేస్తే, అధికారంలోకి వచ్చాక అమరావతి తో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలని విశాఖపట్నాన్ని, రాయలసీమ అభివృద్ధి చెందాలని కర్నూలు ప్రాంతాన్ని గుర్తించి ఏపీకి మూడు రాజధానులు ప్రకటించడం జరిగింది.
ఇదిలా ఉండగా ఈ మూడు రాజధానులు విషయంలో న్యాయస్థానంలో కేసు పెండింగ్లో ఉండగా… విశాఖ పట్టణాన్ని చాలావరకు రాజధానిగా ఫిక్స్ అయిపోయారు పబ్లిక్. ప్రజలు అక్కడికి వెళ్లి సెటిల్ అయ్యే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టేసారు. ఇదిలా ఉండగా అందుకు తగ్గట్లుగానే ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేయడానికి రెడీ అవుతుంది. పరిస్థితి ఇలా ఉండగా విశాఖ విషయంలో కీలక అడుగు దిశగా జగన్ సర్కార్ రెడీ అయింది.
మేటర్ లోకి వెళ్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తరువాత అత్యంత ప్రతిష్టాత్మకమైన మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని విశాఖకు తీసుకురావటానికి జగన్ సర్కార్ మంచి ఉత్సాహం మీద ఉంది. త్వరలోనే మెట్రో పనులు స్టార్ట్ చేసి 2023 నాటికి కంప్లీట్ చేసే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. ఒక విధంగా చూసుకుంటే దక్షిణ భారతదేశంలో విశాఖపట్నాన్ని మరో గోవా మాదిరిగా డెవలప్ చేసే ఆలోచనలో పర్యాటకంగా ఆకర్షించే విధంగా విశాఖ ని తీర్చిదిద్దే టైపులో వైయస్ జగన్ ఆలోచన చేస్తున్నట్లు టాక్ వస్తోంది. దీంతో విశాఖలో ఇప్పటికే మొదలుపెట్టిన ప్రభుత్వ పనులను చాలా త్వరితగతిన పూర్తిచేయడానికి జగన్ సర్కార్ కీలక అడుగులు వేస్తున్నట్లు సమాచారం.