తెలంగాణ రాజకీయాలలో ఎప్పటినుండో సీఎం కేటీఆర్ కి ముఖ్యమంత్రి పదవి కట్ట పెట్టడం ఖాయమనే వార్తలు రావడం జరిగాయి. కేసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి మొత్తం బాధ్యత అంతా కేటీఆర్ కి అప్పజెప్పి… జాతీయ స్థాయిలో కేసిఆర్ తోడు ఫ్రంట్ ఏర్పాటు చేస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా ఇటీవల సిపిఐ నేత నారాయణ కేసీఆర్ కి సలహా ఇచ్చారు. తెలంగాణలో మొత్తం కేటీఆర్ పరిపాలన నడుస్తుందని…. కేసిఆర్ ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారని ఇంకెందుకు కేటీఆర్ ని సీఎంగా ప్రమాణ స్వీకారం చేయిస్తే బాగుంటుంది అన్నట్టుగా సజెషన్ ఇచ్చారు.
మరోపక్క జిహెచ్ఎంసి ఎన్నికలు పూర్తయిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ ని చేసి, పరిపాలన మొత్తం కేటీఆర్ చేతిలో పెట్టి సొంత నిర్ణయాలు తీసుకునే ఈ విధంగా కేసిఆర్ సరికొత్త స్కెచ్ వేసినట్లు తెలంగాణ రాజకీయాల వార్తలు వెలువడుతున్నాయి. అందువల్లే ఇటీవల కరోనా వైరస్ కట్టడి చేయడంలో విమర్శలు ఒక్కసారిగా ప్రభుత్వ వ్యవస్థల నుండి ప్రతిపక్షాల నుండి కేంద్రం నుండి రావటంతో కేటీఆర్ రంగంలోకి దిగినట్లు టిఆర్ఎస్ పార్టీలో టాక్.
అదే రీతిలో ప్రస్తుతం తెలంగాణలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్న తరుణంలో వరంగల్ ప్రాంతం చాలా వరకు ముంపుకు గురవడంతో … ఆ ప్రాంతాలలో కేటీఆర్ స్వయంగా తిరగటం బాధితులకు అండగా ఉండి 10 కోట్లు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా వరదలకు కారణమైన ఆక్రమణలు తొలగించాలని అధికారులకు దగ్గరుండి కేటీఆర్ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో అన్నట్టు సూచించారు.
మొత్తం మీద త్వరలో కేటీఆర్ కి ముఖ్యమంత్రి పట్టాభిషేకం గ్యారెంటీ అన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోపక్క టిఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కూడా కేటీఆర్…మీ ముఖ్యమంత్రి చేయాలి అంటే ఇదే సరైన సమయమని కేసిఆర్ పై ఒత్తిడి తీసుకువస్తున్నారట. కేసిఆర్ కూడా ఇదే ఆలోచిస్తున్నట్లు , కేటీఆర్ కి సీఎం పదవి అప్పజెప్పి కొన్నాళ్ళు ఫాంహౌస్లో రెస్ట్ తీసుకుని, సరిగ్గా 2024 ఎన్నికలకు ఏడాది ఉందనగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆలోచన చేస్తున్నట్లు టాక్.