అమరావతి, జనవరి 23: మాట పెదవి దాటిన పదినిమిషాలకే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్కు చెంప పెట్టులాంటి హెచ్చరికలు చోటుచేసుకున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిజి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. విశాఖపట్నం జిల్లా పర్యటనలో ఉన్న పవన్ టిజి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తాము వద్దనుకుని వదిలివేసిన రాజ్యసభ సీటును టిజి తీసుకున్నారని ఆయన గుర్తుచేశారు.
కర్నూలు పారిశ్రామికవేత్తగా ఆయన పర్యావరణ కాలుష్యానికి కారణమౌతున్నారని ఆయన చెప్పారు.
పనికిమాలినవి కాకుండా పనికి వచ్చే మాటలు మాట్లాడాలని ఆయన హితవు పలికారు.
పెద్ద మనిషి అని మర్యాద ఇచ్చాను అని ఆయన అన్నారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వదిలేది లేదని ఆయన హెచ్చరించారు. నేను నోరు విప్పితే మీరేమి అవుతారో గమనించుకోవాలని ఆయన అన్నారు.
తెలుగుదేశం నేతలు ఎలక్షన్ గేం మొదలు పెట్టారని ఆయన అన్నారు.
దివంగత ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోములు చనిపోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని ఆయన చెప్పారు.