(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా….
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తగ్గించింది. తీవ్రవాదులు, మావోయిస్టులు, ఎర్ర చందనం స్మగ్లర్లు, అసాంఘిక శక్తుల నుంచి చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉన్నది. జడ్ప్లస్ కేటగిరిలో ఎన్ఎస్జీ రక్షణలో ఉన్న ప్రధాన ప్రతిపక్షనేత భద్రతా సిబ్బందిని 146 నుంచి 67కు తగ్గించారు. ఎమ్మెల్సీ, టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉంది. చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఇప్పటికీ ప్రాణహాని ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భద్రత తగ్గించింది. గతంలో ప్రభుత్వం కల్పించిన భద్రతా స్థాయిని పునరుద్ధరించాలి.
ఐటీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి
పార్లమెంట్ నియోజక వర్గాల వారిగా నైపుణ్య , శిక్షణ సంస్థలు ఏర్పాటు చేస్తున్నాము. విద్యాలయాలలో పరిశ్రమల అభివృద్ధి కి దోహదం చేసే విద్య విధానంతో ముందుకు వెళ్తున్నాం. పారదర్శకత పాలన రాష్ట్రంలో ఉంది. 2024 నాటికి పారిశ్రామిక అభివృద్ధి సూచిలో రాష్ట్రం ముందు ఉంటుంది. విశాఖ త్వరలో ప్రపంచ స్థాయి మహా నగరంగా అవతరిస్తుంది. ఆదాని గ్రూప్ తమ అనుకూలత కోసం ప్రదేశం మారుకున్నారు తప్ప మరో కారణం లేదు. మా వల్ల మారుకున్నారు అని ప్రచారం చేయడం దురదృష్టకరం. రాష్ట్రంలో నైపుణ్య అభివృద్ధి పెంచే లక్ష్యంగా ఒక విశ్వవిద్యాలయం స్థాపిస్తాం.
కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి
గత ఐదేళ్ల టీడీపీ హయాంలో వడ్డీ రాయితీ చెల్లించలేదు. టీడీపీ పాలనలో నిర్లక్ష్యం చేసిన డీసీసీబీలు, సహకార బ్యాంకు లను బలోపేతం చేయాలని నిర్ణయించాం. ప్రతిపక్ష నేత చంద్రబాబు బస్సుయాత్ర ఎందుకు చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన తప్పులేమిటో ముందు చెప్పాలి. చంద్రబాబు గ్రాఫిక్స్ వెనుక నిజాలను బయటపెట్టడం తప్పా.