Ys Jagan: వైయస్ జగన్ ప్రభుత్వం “నాడు నేడు” కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూల్స్ మరియు హాస్పిటల్స్ అదేరీతిలో ప్రభుత్వ కార్యాలయ భవనాల రూపురేఖలు మార్చుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ.. భవనాలకు కొత్త రంగులు అందిస్తూ విద్యార్థులు చదువుకోవడానికి మంచి వసతులు కల్పిస్తూ వస్తున్నారు. అదే తరహాలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా అనేక కార్యక్రమాలు చేపడుతూ.. వస్తున్న రోగులకు అన్నీ అందుబాటులో ఉండే విధంగా నాడు నేడు కార్యక్రమం ద్వారా.. లేని వసతులను అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ద్వారా అనేక పాఠశాలలు మరియు హాస్పిటల్స్ రూపురేఖల మార్చిన జగన్ ప్రభుత్వం తాజాగా రెండో విడత.. “నాడు నేడు” కార్యక్రమానికి నడుంబిగించింది.
దాదాపు మొదటి విడత పనులు పూర్తి కావడంతో రెండో విడత పనులకు జగన్ ప్రభుత్వం..4,446 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ నిధుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పలు పాఠశాలలో అభివృద్ధి పనులు చేయటానికి రెడీ అయింది. ఈ మేరకు పరిపాలన అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఈ క్రమంలో 12,678 స్కూల్స్ లో.., 1668 ప్రభుత్వ హాస్టల్స్ లో.., 473 జూనియర్ కాలేజీలో, 17 డైట్ సంబంధిత విద్యాసంస్థలలో, 391 గురుకుల రెసిడెన్షియల్ స్కూల్, 672 మండల రిసోర్స్ కేంద్రాలు, 446 భవిత సెంటర్ లో మొత్తంగా చూసుకుంటే 16,345 చోట్ల రెండో విడత పనులు ప్రారంభించడానికి జగన్ ప్రభుత్వం రెడీ అయ్యింది.
Read More: YS Jagan: వైయస్ జగన్ పై పొగడ్తల వర్షం కురిపించిన మెగా బ్రదర్ నాగబాబు..!!
మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా అనేక పాఠశాలలు.. మౌలిక సదుపాయాలు తీసుకురావడం మాత్రమేకాక అంతకు ముందు పాఠశాల తాజాగా నాడు-నేడు నిధులతో మరమ్మతులు చేసిన పాఠశాల కి చాలా మార్పులు తీసుకువచ్చారు. అయితే రెండో విడతలో భారీ ఎత్తున ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు స్కూల్స్ రూపురేఖలు మొత్తం మార్చేయనున్నట్లు తెలుస్తోంది.