విజయవాడ: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి తమకు ఇంత వరకూ ఎటువంటి ఆహ్వానం అందలేదనీ, ఒక వేళ ఆహ్వానం వచ్చినా వెళ్లేది లేదునీ వైసిపి సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
గురువారం పార్టీ కౌంటింగ్ ఏజంట్ల శిక్షణా కార్యక్రమం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకున్నారు కాబట్టే టిడిపి వారు మాపై విమర్శలు, అభాండాలు చేస్తున్నారు అని ఉమ్మారెడ్డి అన్నారు.
రేపు టిడిపి ఓడిపోయిన తరువాత ఈవిఎంల వల్లనే ఓడిపోయామని చెప్పడానికే ఈ డ్రామాలు అడుతున్నారని ఉమ్మారెడ్డి విమర్శించారు.
కేంద్రంలో బిజెపేయేత ప్రభుత్వం ఏర్పాటు దిశలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈ నెల 23న యుపిఎ కూటమి నేతలతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలను సైతం ఆహ్వనిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఉమ్మారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.