అమరావతి: రాయలసీమలో వైఎస్ జగన్ పార్టీ అధికారపక్షాన్ని తుడిచిపెట్టింది. సీమ నాలుగు జిల్లాల్లో 52 సీట్లు ఉండగా 50 సీట్లలో వైసిపి విజయం సాధించింది. ఇక లోక్సభ సీట్ల విషయానికి వస్తే మొత్తం ఎనిమిది స్థానాలూ వైసిపి వశమయ్యాయి.
శాసనసభ స్థానాలలో టిడిపి గెలిచిన రెండు సీట్లూ బావాబావమరదుల సీట్లు. చిత్తూరు జిల్లా, కుప్పంలో టిడిప అధినేత చంద్రబాబు నాయుడు, అనంతపురం జిల్లా, హిందూపూర్లో నందమూరి బాలకృష్ణ విజంయం సాధించారు. వీరిద్దరూ బావాబావమరదులు అన్న విషయం తెలిసిందే.