ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక చిత్తూరు జిల్లాలో అసలు అభివృద్ధి జరగడం లేదని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజానీకం నుండి టాక్ వినపడుతుంది. ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం చిత్తూరులో జరగలేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ ఒక్క స్థానం మినహా అన్ని చోట్ల జిల్లాలో విజయబావుటా ఎగరవేయడం జరిగింది. కానీ ప్రస్తుతం ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చిత్తూరులో జరగనట్లు.. వైసీపీ నేతలు కూడా పెద్దగా పట్టించుకోనట్లు అక్కడి ప్రజానీకం నుండి వార్తలు వస్తున్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గం, నగరి నియోజకవర్గంలో వైసీపీ నేతలు పెద్దగా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదట.
మరోపక్క ఈ నియోజకవర్గాలలో ఒకప్పుడు కీలక నాయకులుగా రాణించిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, స్వర్గీయ గాలి ముద్దుకృష్ణమ నాయుడు కొడుకులు తండ్రులా వారసత్వాన్ని అందిపుచ్చుకుని గత ఎన్నికలలో హడావిడి చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి గతంలో అనేక మార్లు టీడీపీ తరుపున గెలిచి శ్రీకాళహస్తి ని టీడీపీ కంచుకోటగా మార్చారు. 2019 ఎన్నికలలో తన కొడుకు బొజ్జల సుధీర్ రెడ్డి ని బరిలోకి దింపి టిడిపి తరఫున పోటీ చేయించగా ఆయన ఓటమి పాలవడం జరిగింది. వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలవడం జరిగింది.
అయితే ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పెద్దగా నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం లేదని వార్తలు వస్తున్నాయి. మరోపక్క బొజ్జల సుధీర్ రెడ్డి 2019 ఎన్నికల ఓటమి తర్వాత హైదరాబాద్ కి పరిమితమయి.. ఇప్పటి వరకు నియోజకవర్గం వైపు చూడలేదు అని టాక్. ఇదే తరుణంలో నగరి నియోజకవర్గంలో గాలి ముద్దుకృష్ణమ నాయుడు కొడుకు భాను ప్రకాష్ రెడ్డి కూడా ఓడిపోయిన తర్వాత నగరి నియోజకవర్గం లో పెద్దగా అందుబాటులో ఉండకుండా బెంగుళూరు నగరానికి పరిమితమైనట్లు ఆ ప్రాంతంలో వార్తలు వస్తున్నాయి.
దీంతో రెండు నియోజకవర్గాలలో వైసీపీ నేతలు అందుబాటులో లేకపోవటంతో జగన్ పార్టీ నాయకులు ఇండైరెక్టుగా ఛాన్స్ ఇచ్చిన ఈ రెండు స్ట్రాంగ్ ప్లేసులో టీడీపీ నేతలు నిలదొక్కుకోలేక పోతున్నట్లు… సమాచారం. ఆ రెండు నియోజకవర్గాలు దాదాపు గతంలో టీడీపీ ఆధీనంలో ఉండడంతో ఆ ప్రాంత ప్రజలు….టీడీపీ నేతలు కోసం ఎదురుచూస్తున్న వారి నుండి సరైన రెస్పాండ్ రావటం లేదని, తమ సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని ఎదురుచూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.