ఇటీవల కృష్ణా జిల్లాలో వైయస్సార్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఓపెనింగ్ సందర్భంగా చంద్రబాబు ని వైయస్ జగన్ ఏకిపారేశారు. కృష్ణా జిల్లా కి చెందిన మంత్రులతోపాటు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంకా కొంత మంది వైసీపీ నేతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వైయస్ జగన్ చాలా కాలం తరువాత డైరెక్ట్ గా చంద్రబాబు పేరు ఎత్తి మరీ క్లాస్ పీకారు. ఈ సందర్భంగా చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అమరావతి ప్రాంతానికి చేసింది ఏమీ లేదని ద్వజమెత్తారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాజధాని జిల్లాలో జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఇతర 30 గ్రామాలకు తాగునీరు అందించే ప్రధాన ఉద్దేశంతో ఈ స్కీమ్ ఓపెన్ చేస్తున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు.
అధికారంలోకి వచ్చి 14 నెలల్లోనే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కి శంకుస్థాపన చేశామని…. వచ్చే ఫిబ్రవరి కళ్ల దీన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగు వందల తొంభై కోట్ల ప్రాజెక్టు వ్యయం కలిగిన దీనివల్ల 2.7 టీఎంసీల నీటితో 38,627 ఎకరాలకు సాగునీరు అందుతుందని స్పష్టం చేశారు. నిజంగా రాజధానిపై చంద్రబాబుకి ప్రేమ ఉంటే ఇలాంటి ప్రాజెక్టులు ఆయన హయాంలో ఎందుకు మొదలు పెట్టలేదు అని ప్రశ్నించారు. చంద్రబాబు ఐదు సంవత్సరాల అధికారంలో ఎలాంటి ప్రాజెక్టు కట్టలేదని…. కేవలం గ్రాఫిక్స్ తో ఐదు సంవత్సరాలు పరిపాలించి రాష్ట్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని జగన్ చెప్పుకొచ్చారు.
కాగా వైయస్ జగన్ డెడ్ లైన్ పెట్టి మరి హామీ ఇవ్వటంతో గుంటూరు, కృష్ణా జిల్లాకు చెందిన రైతులు ఎంతగానో సంతోషపడుతున్నారు. ఇదిలా ఉండగా గత కొంత కాలం నుండి చంద్రబాబు మరియు టిడిపి పార్టీకి చెందిన నాయకులు అనేక విమర్శలు చేస్తున్నా జగన్ ఎప్పుడూ చంద్రబాబు పేరు నేరుగా ప్రస్తావించలేదు. కానీ తాజాగా “వైయస్సార్ వేదాద్రి” ప్రాజెక్టు చంద్రబాబుకి ఎక్కువగా అనుకూలంగా ఉండే జిల్లాలో ఓపెన్ చేసిన తరుణంలో ఆయన పై జగన్ చేసిన విమర్శలు రెండు జిల్లాలలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారినట్లు ఏపీ రాజకీయాల్లో టాక్.