టెలికాం సంస్థ జియో ఫైబర్ కొత్త ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది. వీటిల్లో వినియోగదారులకు అన్లిమిటెడ్ డేటా వస్తుంది. ఈ ప్లాన్లు రూ.399 నుంచి ప్రారంభం అవుతాయి. వీటితోపాటు ఉచిత కాల్స్ కూడా లభిస్తాయి. సెప్టెంబర్ 1 నుంచి వినియోగదారులు ఈ ప్లాన్లను వాడుకోవచ్చు. రూ.300 ప్లాన్లో 30 ఎంబీపీఎస్ స్పీడ్ వస్తుంది. రూ.999 ప్లాన్లో 150 ఎంబీపీఎస్ స్పీడ్, రూ.1499 ప్లాన్లో 300 ఎంబీపీఎస్ స్పీడ్ వస్తాయి.
రూ.999 ప్లాన్లో అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, జీ 5 వంటి 11 ఓటీటీ యాప్స్ ను, రూ.1499 ప్లాన్లో నెట్ఫ్లిక్స్ ను ఉచితంగా ఇస్తున్నారు. కొత్తగా జియో ఫైబర్ను తీసుకునే వారు 30 రోజుల పాటు ఎలాంటి చార్జిలు లేకుండా ఉచితంగా సేవలు వాడుకోవచ్చు. ఇందులో 10 ఓటీటీ యాప్స్ ను ఫ్రీగా ఇస్తారు. స్పీడ్ 150 ఎంబీపీఎస్ వస్తుంది. 30 రోజుల అనంతరం ట్రయల్ ముగిశాక అవసరం లేదనుకుంటే సర్వీస్ ను నిలిపివేయవచ్చు. లేదా పైన తెలిపిన ప్లాన్స్లో ఏదైనా ఒక ప్లాన్ తీసుకుని జియో ఫైబర్ ను కొనసాగించవచ్చు.
ఇప్పటికే జియో ఫైబర్ ను వాడుతున్న వారు కొత్త ప్లాన్లకు ఆటోమేటిగ్గా అప్గ్రేడ్ అవుతారు. కాగా ఈ సందర్భంగా జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ దేశంలో అతి పెద్ద బ్రాడ్ బ్యాండ్ లీడర్గా అవతరించాలన్నదే తమ ఉద్దేశమని, అందుకనే ఎక్కువ వేగంతో అన్లిమిటెడ్ ప్లాన్లను ఇస్తున్నామని తెలిపారు.