Sharmila: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ ను వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల గత కొద్దికాలంగా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మంత్రి కేటీఆర్ పై ఆమె సంచలన విమర్శలు చేశారు. కేటీఆర్ అంటే ఎవరు? అంటూ సెటైర్లు వేశారు. అంతేకాకుండా తనపై ఎదురుదాడి చేసిన కేటీఆర్ అనుచరుల విషయంలో ఆమె ఒకింత ఘాటుగా రియాక్టయ్యారు. ఇలా కేటీఆర్ విషయంలో దూకుడుగా స్పందిస్తున్న షర్మిల మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇలాకాలో ఆందోళన చేయనున్నారు.
Read More : YS Sharmila: ఏంటో ఈ వింత… లక్షలు తీసుకొని షర్మిల పార్టీలో పదవుల అమ్మకం
ఒకటే అజెండాతో షర్మిల…
నిరుద్యోగుల సమస్యలపై వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రత్యేక ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. వారికి అండగా నిలిచి వారిలో భరోసా నింపేందుకు ప్రతి మంగళవారం షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఏ మేరకు దీక్షలు చేశారు. తాజాగా 3వ తేదీన మంత్రి కేటీఆర్ ఇలాకా అయిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆమె పర్యటించనున్నారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని బలవన్మరణానికి పాల్పడిన గంభీరావుపేట మండలం, వట్టిమల్ల గ్రామానికి చెందిన మహేశ్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చనున్నారు.
Read More: KTR: హరీశ్, కేటీఆర్ మధ్య లెక్కలు సరిపోయాయా?
ఓదార్పు అనంతరం
మహేశ్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షర్మిల నిరాహారదీక్ష చేపట్టనున్నారు. గత కొంతకాలంగా మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేస్తున్న షర్మిల తాజాగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా పర్యటన చేపట్టడం సహజంగానే చర్చకు కారణంగా మారింది. అంతేకాకుండా ఈ చర్య విపక్షాలకు అస్త్రంగా మారనుందని అంటున్నారు.