మునుగోడు ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాలు విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైయ్యాయి. ప్రధాన పక్షాలు ప్రత్యర్ధులపై ఆరోపణలు, విమర్శలు చేసుకుంటాయి. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని అభ్యర్ధులుగా బరిలో నిలపగా, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) బీసీ వర్గానికి చెందిన నేతను బరిలో దింపింది. ఈ అభ్యర్ధి విజయం కోసం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ప్రచారంలో పాల్గొంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలు భూర్జువా విదానాలనే అవలంబిస్తున్నాయని విమర్శిస్తున్న ప్రవీణ్ కుమార్.. మునుగోడులో మెజార్టీ ఓటర్లు ఉన్న బీసీ వర్గానికి తమ పార్టీ టికెట్ ఇచ్చిందని ఓటర్లకు వివరిస్తున్నారు.
ప్రచార పర్వంలో మంగళవారం రాత్రి ఆసక్తిపరమైన పరిణామం చోటుచేసుకుంది. ప్రచారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ లు తారసపడటంతో ఒకరికొరకు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అంతే కాకుండా ప్రవీణ్ కుమార్ ను తాను కలిసిన విషయాన్ని కూడా రేవంత్ రెడ్డే వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా ఫోటోలను షేర్ చేస్తూ తమ కలయిక యాదృఛ్చికమేనన్న రేవంత్.. సమ సమాజ ఉన్నతి కోసం ప్రవీణ్ వాంటి వారితో కలిసి భావాలు పంచుకోవడం సమాజానికి అవసరమని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. ప్రవీణ్ కుమార్ ను కలవడం తనకు సంతృప్తిని ఇచ్చిందని రేవంత్ పేర్కొన్నారు.
దళిత బహుజన వర్గాల్లో మంచి పేరు ఉన్న ప్రవీణ్ కుమార్ ను ప్రస్తుత మునుగోడు ఎన్నికల తరుణంలో రేవంత్ రెడ్డి ప్రశంసించడం, ఫోటోలను షేర్ చేయడం రాజకీయ ఎత్తుగడ (చతురత) అని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో పక్క సోషల్ మీడియాలో రేవంత్, ప్రవీణ్ కుమార్ కలయిక ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. వీటిపై నెటిజన్ లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చీకటి దోస్తాన్ అని చెప్పద్దు అంటావ్ అంతేకదా అంటూ రేవంత్ వ్యతిరేక వర్గీయులు సెటైర్ వేస్తున్నారు.
Breaking: సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్
చీకటి దోస్తాన్ అని చెప్పద్దు అంటావ్ అంతేకాద .. pic.twitter.com/WzafloQ0W0
— పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA) October 11, 2022