ఆదిత్య వాళ్ళింట్లో అందరూ కలిసి శ్రావణ శుక్రవారం వ్రతం చేస్తారు.. దేవి కోసమని ఆదిత్య వ్రతం మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతాడు.. వత్రం పూర్తయ్యాక భర్త కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు.. ఆదిత్య లేకపోవడంతో సత్య ఎలా ఆశీర్వాదం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది.. అప్పుడు పంతులుగారు మీ ఆయన వదిలిపెట్టిన పై దోవతి ఇక్కడే ఉంది.. దావత్ కి మీరు నమస్కారం చేసుకున్న కూడా మీ భర్తకు నమస్కారం చేసినంత పుణ్యం లభిస్తుంది అని చెబుతారు..
సత్య అందరూ చూస్తుండగా.. పీట పై ఉన్న ఆ దోవతికి వంగి మోకాళ్ళ మీద కూర్చుని శిరస్సు వంచి నమస్కారం చేస్తుంది సత్య ఆ దోవతికి నమస్కారం చేస్తుండగా.. కళ్ళల్లో నించి నీళ్లు పటపట కారిపోతాయి.. సత్య ఏడుస్తూ దండం పెట్టడం చూసి ఇంట్లో అందరికి బాధ కలుగుతుంది.. దేవుడమ్మ ఆదిత్య రాగానే సత్యను ఓదార్చమని చెప్పాలి.. తను మాత్రమే సత్యను ఇలాంటి పరిస్థితుల్లో ఓదార్చగలడు అని అనుకుంటుంది..
దేవి రాధ కోసం వెతుక్కుంటూ అక్కడ ఫోన్ మోగడం గమనిస్తుంది. ఎవరు చేశారని లిఫ్ట్ చేస్తుంది ఏంటి నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు.. నేను నీకు ఫోన్ కొనిచ్చింది ఎందుకు? అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి కదా అని బెదిరిస్తూ మాట్లాడుతాడు. నేను ఏం చేశానో అవన్నీ నా కూతురుకి చెప్పి తన దృష్టిలో వెధవని చేయాలి అని అనుకుంటున్నావా.. అని మాధవ్ చెప్పిన మాటలు అతను మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న తర్వాత దేవి రాధతో నేను నాయనతో మాట్లాడాను.. నీ ఫోన్ కి కాల్ చేస్తే లిఫ్ట్ చేశాను అని చెబుతుంది.. ఇదంతా మాధవ్ కుట్ర అని తెలుసుకొని రాధ బాధపడుతుంది..