ఎప్పుడెప్పుడా విడుదలవుతుందా? అని అభిమానులు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన భారీ బడ్జెట్ చిత్రం `సాహో`. రూ.350కోట్ల భారీ బడ్టెట్తో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ కథానాయకుడు. శ్రద్ధాకపూర్ హీరోయిన్. భారీ తారాగణం, హాలీవుడ్ టెక్నీషియన్స్ అందరూ పనిచేసిన ఈ సినిమా విడుదలైన రోజు నుండి డివైడ్ టాక్ను రాబట్టుకుంది. ఈ టాక్ను పక్కన పెడితే తొలిరోజున సినిమా 104.8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రంలో ఆర్ట్ వర్క్ను యూనిట్ తస్కరించిందంటూ బాలీవుడ్ హీరోయిన్ లీసారే ఆరోపణలు చేశారు. `బేబీ వోంట్ యు టెల్ మీ… ` అనే సాంగ్లో ఓ సీన్లో ఆర్ట్ వర్క్ను షిలో శివ్ సులేమాన్ ఆర్ట్ వర్క్ నుండి కాపీ కొట్టారని ఆమె బలంగా ఆరోపణలు చేసింది. అందుకు ఆధారాలను చూపిస్తూ సాహో పోస్టర్ను షిలో శివ్ సులేమాన్ ఆర్ట్ వర్క్ పోస్టర్ను కలిపి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది లిసారే. ఈ రెండు ఫొటోల్లో ఆర్ట్ వర్క్ ఒకేలా అనిపిస్తుంది. మరి దీనిపై సాహో యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
previous post