(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అతనొక ప్రజాప్రతినిధి. లక్షా 22వేల ఓట్ల మెజార్టీతో పార్లమెంట్ ఎన్నికల్లో నెగ్గాడు. పార్లమెంట్కు వెళ్లి ప్రమాణ స్వీకారం చేయాల్సిన అతను నేడు కోర్టు ఉత్తర్వులతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. బహుజన సమాజ్ పార్టీకి చెందిన అతుల్ రాయ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘాసి నియోజకవర్గం నుండి ఎస్పి, బిఎస్పి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల ప్రచార సమయంలోనే అతనిపై ఒక మహిళ కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అతనిపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. మే మొదటి వారం నుండే రాయ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనలేదు. ఇదిలా ఉండగా తమ అభ్యర్థిపై బిజెపి కావాలనే తప్పుడు కేసు పెట్టిందని బిజెపి అధినేత్రి మాయావతి ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. అతుల్ రాయ్ ఎన్నికల ప్రచారం చేయకపోయినా లక్షా 22వేల మెజార్టీతో బిజెపి అభ్యర్థి హరినారాయణ్పై గెలిచారు. ఈ నెల 17,18 తేదీల్లో ఎంపిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో పార్లమెంట్కు వెళ్లలేదు. ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం తిరస్కరించింది.
దీంతో ఆయన అజ్ఞాతం వీడి నేడు వారణాసి కోర్టులో లొంగిపోయారు. న్యాయమూర్తి అతనికి 14రోజులు రిమాండ్ విధించారు.
పార్లమెంటరీ నిబంధనల ప్రకారం కొత్తగా ఎన్నికైన అభ్యర్థులు లోక్సభ తొలి 60పనిదినాల్లో ప్రమాణ స్వీకారం చేయాలి. ఈ లోపల ప్రమాణం చేయకపోతే ఎంపి సభ్యత్వాన్ని కోల్పోతారు.