అమరావతి: ప్రధాని నరేంద్ర వ్యవహరించిన తీరే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విధ్వేషాలకు కారణమయ్యాయని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బీహార్లో తెలుగు రాష్ట్రాల గురించి ప్రధాని మోది మాట్లాడటం వెనుక ఆంతర్యమేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. ఆదివారం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. మోది అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. విభజన హామీలపై ఐదేళ్లలో ఒక్క సారి అయినా రెండు రాష్ట్రాలను సమావేశపరిచారా అని చంద్రబాబు ప్రశ్నించారు. మోదికి గుజరాత్ తప్ప ఇతర రాష్ట్రాల అభివృద్ధి కనపడటం లేదని చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చి నిధులు విడుదల చేస్తే గుజరాత్ రాష్ట్రాన్ని మించిపోతుందన్న భావతోనే రాష్ట్రాభివృద్ధని మోది
అడ్డుకున్నారని చంద్రబాబు ఆరోపించారు.
మోది కేవలం మాటలు తప్ప చేతల్లో చూపించిది ఏమి లేదని చంద్రబాబు విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీలు తాము చేస్తున్న ధర్మపోరాట దీక్షకు మద్దతు ఇచ్చాయని చంద్రబాబు గుర్తు చేశారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వడానికి తాము అహ్వానిస్తున్నామనీ, ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన నిధులు ఎందుకు వెనక్కి తీసుకున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా ఎపిపై మూకుమ్మడి దాడులు చేశారని చంద్రబాబు విమర్శించారు. ఐదేళ్లలో మోది సాధించింది. ఒరగబెట్టింది ఏమీలేదని చంద్రబాబు అన్నారు. మోది వైసిపికి మద్దతుగా నిలబడ్డారనీ, ఈసి కూడా వారికే మద్దతు పలికిందని చంద్రబాబు అరోపించారు. పన్నులు వసూలు చేసుకున్నారే గానీ కనీస గౌరవం కూడా ఇవ్వలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించే వరకూ ఎపి గురించి మాట్లాడే అర్హత మోదికి లేదని మరో సారి చంద్రబాబు స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్లో 40మంది తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ప్రధాని మోది అనడం దేనికి సంకేతమని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కూలదోస్తామని మోది భయపెడుతున్నారా అని చంద్రబాబు అన్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న ఈ విధంగా మాట్లాడటం సభ్యతేనా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల సంఘంపై ఎప్పుడైనా ఇన్ని విమర్శలు వచ్చాయా అని అడిగారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో బిజెపి శాశ్వతంగా దోషిగా మిగిలిపోతుందని చంద్రబాబు అన్నారు.