బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నా.. ట్విట్టర్ లో మాత్రం ఆయన డబ్ స్మాష్ వీడియో ఒకటి పోస్ట్ అయింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన ఓ హామీని ఆయన చదువుతున్నట్లు అందులో ఉంది.
‘అచ్ఛే దిన్ ఆనేవాలే హై’, ‘హిందుస్థాన్ కే ఏక్ ఏక్ గరీబ్ ఆద్మీ కో ముఫ్త్ మే 15-20 లాఖ్ యుంహీ మిల్ జాయేగా’ (మంచి రోజులు వస్తున్నాయి, దేశంలోని ప్రతి పేదవాడికి ఉచితంగా రూ. 15-20 లక్షలు అలా వచ్చి పడతాయి) అని మోదీ చెప్పిన మాటలకు లాలూ తన మార్కు డబ్బింగ్ చూపించారు.
मुफ़्त में ले लो 15 लाख, अच्छे दिन और जुमला। pic.twitter.com/2Pfhg2QemK
— Lalu Prasad Yadav (@laluprasadrjd) April 13, 2019
2014 ఎన్నికలలో మోదీ ఇచ్చిన హామీలను ప్రతిపక్ష నాయకులు తరచు ఎద్దేవా చేస్తుంటారు. వాటిలో ఒక్కదాన్నీ ఆయన నెరవేర్చలేదని గుర్తుచేస్తుంటారు. రూ. 900 కోట్ల దాణా స్కాంకు సంబంధించిన పలు కేసులలో శిక్షలు పడిన లాలు ప్రసాద్ యాదవ్ జైలు జీవితం గడపాల్సి ఉంది. కానీ, అనారోగ్యం పేరుతో ప్రస్తుతం ఆయన రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో 8 నెలలుగా చికిత్స పొందుతున్నారు. అంతకుముందు బిర్సా ముండా సెంట్రల్ జైల్లో రెండేళ్లు గడిపారు.