Acharya: మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ఆచార్య.. బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఆచార్య బ్యాలెన్స్ షూటింగ్ గురించి లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది..
ఈ సినిమా మే 13న విడుదల కావాల్సి ఉంది కానీ.. పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా వాయిదా వేశారు మేకర్స్.. అయితే ఈ చిత్రం లో ఇంకా కొన్ని రోజులు షూట్ బ్యాలెన్స్ ఉందని టాక్.. ఆచార్య లో ఇంకా 15 రోజుల మేరకు షూట్ బ్యాలెన్స్ ఉందట. ఈ షూటింగ్ అయిపోతే ఇక మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే అని సమాచారం.. అలాగే ఈ షూట్ లో ఇంకా చరణ్ పై తీయాల్సిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు కూడా ఉన్నాయట. అవి అన్ని అయిపోతే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి.. ఆగస్టులో సినిమా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తాజా సమాచారం.
ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ గా, పూజా హెగ్డే నీలాంబరి గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఒకే ఆశయం కోసం కలిసి పోరాట యోధుడిగా చిరంజీవి, చరణ్ కలిసి నటించడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు టాక్.. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.