ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ప్రతిరోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఇప్పటికే 10 లక్షలమంది కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు. ఇలాంటి నేపథ్యంలో వ్యాక్సిన్ కనుగొనేందుకు అన్ని దేశాల శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ, ఎటువంటి ఫలితం కనిపించలేదు. వాక్సిన్ కనుగొనే లోపు ఈ భయంకరమైన వైరస్ నుంచి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
అందులో భాగంగానే, క్షయ లేదా ఫ్లూ వంటి వ్యాధులను ఎదుర్కొనే టీకాలతో కరోనా ముప్పును తగ్గించవచ్చని అభిప్రాయపడుతున్నారు క్షయ లేదా ఫ్లూ వ్యాక్సినతో కరోనాని పూర్తిగా తగ్గించవచ్చని ఎక్కడ నిరూపించ బడలేదు. కానీ, ఈ టీకాలను వైరస్ నుంచి కాపాడుకోవడానికి ఇస్తారు. అంతేకాకుండా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగు పరుస్తాయి.
వర్షాకాలం మొదలవడంతో అనేక రకాల సీజనల్ వ్యాధులు రావడం సాధారణమే, కానీ కరోనాతో బాధ పడే వ్యక్తికి శరీరంలో రోగ నిరోధక శక్తి బలహీనంగా తయారవుతుంది. మరీ సీజనల్ వ్యాధులు రావడంతో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని, ఈ టీకాలను ముందుగానే తీసుకోవడం ద్వారా, సీజనల్ వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది రక్తంలో ప్రతిరోధకాలు ఉత్పత్తి చేసి, వ్యాధి కారకంపై దాడి చేయడానికి సహాయపడుతుంది.
అంతేకాకుండా శరీరంలో ఈ వైరస్ఎక్కువ కణాలకు వ్యాపించకుండా ఉండడానికి తోడ్పడుతుంది.ఫ్లూ వ్యాక్సిన్ ముందుగా తీసుకోవాలని సూచించడానికి ఒక కారణమని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని మూడు అధ్యయనాలు కూడా ధ్రువీకరించాయి. ఇటలీలో కరోనా బారిన పడిన వారికి ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా మరణాల రేటు తక్కువగా సంభవించిందని, ఇటలీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 3 కోట్ల 30 లక్షలమందికి కరోనా వైరస్ వ్యాపించింది. ఇక అందులో 2 కోట్ల 46 లక్షలమంది కరోనా భారీనుంచి బయటపడగా 10 లక్షలమంది కరోనా వైరస్ కు బలయ్యారు.