పిల్లలకు ఏం కాకుడదని ఎంత జాగ్రతగా పెంచుతామో.. అంతే జాగ్రతగా ఏది చేయాలి ఏది చేయొద్దనే విషయాలను కూడా నేర్పించాలి. లేకుంటే వారు రాబోయో రోజుల్లో సొసైటీలో దారుణాలకు ఒడికడుతారని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. పిల్లల ప్రవర్తన మీద తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలని చెబుతున్నారు. ఒకవేళ వారి చేస్టలు ఇబ్బంది పెట్టేలా ఉంటే మంచి మానసిక నిపుణునికి చూపించాలని చెబుతున్నారు.
పిల్లలకు కరుణ, జాలి అనేవి ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఈ మధ్య ఓ బాలుడు కుక్క పిల్లను నీటి తొట్టిలో పడేసి దాన్ని చనిపోయేలా చేశాడు. ఆ బాలుడు అలా చేయడానికి కారణం తల్లిదండ్రులే అని పలువురు అంటున్నారు. ర్యాంకుల వేటలో పడి పిల్లలకు ఏం నేర్పించడం లేదని చెబుతున్నారు. ర్యాంకుల కంటే ముందు జీవిత పాఠాలను నేర్పాల్సిన అవసరం ఉందని కామెంట్ చేస్తున్నారు.
అయితే ఈ వీడియోను తమిళనాడుకు చెందిన సెంథిల్ కుమార్ అనే యానిమల్ లవర్ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. దీనిపై యాంకర్ రష్మి ఆవేదనను వక్తం చేశారు. డ్రిగ్రీలు తెచ్చుకుని అందరి కంటే ముందుండాలనే తపనే నేర్పిస్తున్నారు. కానీ జీవిత పాఠాలను నేర్పిండం మానేశారు అని తన ఆవేదనని వెళ్లబుచ్చారు. రోజురోజుకూ మానవత్వం చనిపోతుందని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో నెటిజన్లు రష్మికి మద్దతు తెలిపారు. చిన్న వయసులోనే పిల్లలకు ఏది మంచి, ఏది చెడు అని చెప్పాల్సిన అవసరం ఉందని పలువురు కామెంట్లు పెడుతూ తమ మద్దతును తెలుపుతున్నారు.
దీనిపై మానసిక నిపుణులు మాట్లాడుతూ.. పిల్లలను సరైన మార్గంలో నడిపే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని చెబుతున్నారు. అలాగే మనతోపాటు ఉండే ప్రాణులపట్ల జాలితో ఉండేలా చూడాలని వారికి పదే పదే చెప్పాలని చెబుతున్నారు. జీవిత పాఠాలే వారిని ఉన్నత శిఖరాల్లో ఉంచుతాయని, అవి లేకపోతే జీవితంలో పైకి రాలేరని చెబుతున్నారు.