బిగ్ బాస్ హౌస్ లో 18వ రోజు ఆట సగం వరకు టాస్ కొనసాగింది. రోబో టీమ్, మానవులు టీం మధ్య అదే రేంజ్ లో గొడవలు కొనసాగాయి. ఇక బిగ్ బాస్ టాస్క్ పూర్తయినట్లు తెలిపి రోబో టీమ్ ను విజేతలగా ప్రకటించారు. ఆ తర్వాత కెప్టెన్సీకి అభ్యర్థులను నిర్ణయించుకోమని గెలిచిన రోబోట్ టీం కు చెప్పాడు. వివరాల్లోకి వెళితే టాస్క్ గురువారం కూడా కొనసాగింది. గెలుపు కోసం రెండు జట్లు చాలా పంతంతో పోటీచేశాయి. అయితే చివరకు గంగవ్వ, అభిజిత్ చార్జింగ్ ఇంకా మిగిలి ఉండడంతో రోబో టీం విజయం సాధించింది.
మనుషుల టీమ్ ప్రయత్నాలను కూడా బిగ్ బాస్ అభినందించారు. ఈ గేమ్ లో అభిజిత్, హారిక తదితరులు ఆకట్టుకున్నారు. ఈ రోజు జరగబోయే కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొన్నబోయే అభ్యర్థులుగా అభిజిత్, హారిక, అవినాష్, గంగవ్వ అభ్యర్థులుగా పోటీకి నిలిచారు. మానవుల టీం లో వరెస్ట్ కంటెస్టెంట్ గా ఎంపిక చేయబడ్డ నోయెల్ సీన్ ను జైలుకు పంపించారు. ఇక ఈ సీజన్ లో తొలిసారి తొలిసారి జైలు పాలు అయిన కంటెస్టెంట్ నోయల్ కావడం విశేషం.
ఇక నొయాల్ ను ఉత్తేజపరుస్తూ కంటెస్టెంట్స్ తమ మధ్య గొడవలు మరిచిపోయి పాటలు పాడుకుంటూ ఇంట్లో సరదాగా గడుపుతుంటే హౌస్ లోకి మరో సెలబ్రెటీ అడుగుపెట్టారు. స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అడుగుపెట్టడంతో ఇంటి సభ్యులు మొదట్లో చాలా కంగారు కి గురి అయ్యారు. కానీ ఆ తర్వాత తమ మధ్య ఇంకొక కొత్త సభ్యురాలు వచ్చినందుకు ఆనందంతో ఎగిరి గంతులేశారు. స్వాతి దీక్షిత్ ముఖానికి మాస్క్ పెట్టుకొని ఇంట్లోకి వచ్చింది. ఇక ఆమె పేరును కూడా ప్రేక్షకులకు పరిచయం చేయకుండా అలాగే టెన్షన్ కొద్దిసేపు మెయింటెయిన్ చేశారు.
జైలులో ఉన్న నోయల్ కు బిగ్ బాస్ ఇంటి నుండి ఆహారం ఇవ్వరాదని కఠిన ఆంక్షలు విధించాడు. అతని ఫుడ్ అతనే తయారు చేసుకోవాలి అని చెప్పాడు. అలాహే అతనికి రాగులు ఇస్తే రాగి జావ మాత్రమే కాచుకొని తాగాలట. హ్యాపీ గా బిగ్ బాస్ జైల్లో సర్వ భోగాలు అనుభవించాలి అనుకున్న నోయల్ కి షాక్ తగిలింది..!