ప్రస్తుతం కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ దేశంలో రోజు రోజుకు తన ఉగ్ర రూపం చూపిస్తుంది. ఇక ప్రస్తుతం దేశంలో ఎలాంటి లాక్ డౌన్ లేకపోయినప్పటికీ బయటకు వెళ్లిన సమయంలో మాస్కు ధరించడం, శానిటైజర్ ఉపయోగించడం ముఖ్యం. ఈ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే తగు జాగ్రత్తలు పాటించాలిసిన అవసరం ఎంతైనా ఉంది.
కరోనా ఎక్కువగా 50 సంవత్సరాలు పైబడిన వారిపై ప్రభావం చూపుతుందన్న విషయం తెలిసిందే. అయితే వయసు మళ్ళిన వారిలో ఇతర అనారోగ్య సమస్యల ఉంటే కరోనా వైరస్ మరింత ప్రమాదకరం అని తెలిసిందే. కరోనా సోకడం ఎంతో ప్రమాదకరమని, కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక షుగర్ వ్యాధితో బాధ పడేవారు, కాలేయ వ్యాధి, మూత్రపిండ తదితర సమస్యలతో బాధపడే వారిలో కరోనా సోకడం వల్ల వాటి పనితీరు తగ్గడమే కాకుండా, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడి మరణం అంచులదాకా వెళ్తున్నారు. డయాబెటిస్ తో బాధపడేవారు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉండడం సురక్షితం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకవేళ బయటకు వెళ్లాల్సిన అవసరం వస్తే మాస్కు తప్పనిసరిగా ధరించాలి. బయటకు వెళ్లేటప్పుడు వారితోపాటు ఒక శానిటైజర్ బాటిల్ వెంట తీసుకు వెళ్ళాలి మనం కొన్న ప్రతి వస్తువు తరువాత చేతులకు శానిటేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. రద్దీగా ఉన్న ప్రదేశాలలో వీలైనంత వరకు వెళ్లకుండా ఉండటం ఎంతో శ్రేయస్కరం.
డయాబెటిస్ తో బాధపడేవారు ప్రతినిత్యం వారి శరీరంలోని చక్కెర స్థాయిలను గమనించుకుంటూ ఉండాలి. వారి ఆరోగ్యం విషయంలో ఎటువంటి మార్పులు సంభవించినా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. వయస్సు మళ్ళిన వారి శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచడం కోసం మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను పదార్థాలను తీసుకోవడం ద్వారా రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.