ఈ ఉరుకుల పరుగుల సమయంలో కనీసం తినడానికి, తాగడానికి కూడా తీరిక లేకపోయింది. పోటీ ప్రపంచం తో పాటు ముందుకెళ్లాలని తపనతో కొందరు ఉన్న కాస్త సమయం లో గబగబా తిని అదే వెళ్ళిపోతూ ఉంటారు. అదేంటి? అంత తొందరగా అని అడిగితే ఇంక చాలు.. ఆకలిగా లేదు, టైం లేదు అన్న మాటలు చెప్పివెళ్తారు. అంతే కాకుండా ఎంతో సమయం ఉన్నప్పటికీ కూడా కొందరు చాలా వేగంగా భోజనం చేస్తారు. అలా చేయడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? భోజనం తొందరగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ అనారోగ్యసమస్యలు ఏమిటో? ఇక్కడ తెలుసుకుందాం.
తొందరగా భోజనం తినేటప్పుడు మనకు తెలియకుండానే కొద్దిగా ఎక్కువ పరిమాణంలో తినేస్తాము . అందువల్ల అధిక బరువు సమస్యతో బాధపడాల్సిన అవసరం వస్తుంది. తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు ఇదే విషయాన్ని వెల్లడించారు.
తొందరగా తినడం వల్ల జీర్ణక్రియ రేటు క్రమంగా తగ్గుతుంది. మనం తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల అజీర్తి , మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకోసమే ఆహారాన్ని భాగా నమిలి మింగటం వల్ల జీర్ణక్రియ రేటు మెరుగుపడుతుంది.
చాలా వేగంగా గా నమిలి మింగ కుండా భోజనం చేయడం వల్ల దాని ప్రభావం ఇన్సులిన్ నిరోధకత పై పడే టైప్ 2 డయాబెటిస్ ను పెంచడానికి ప్రధాన కారణమవుతుంది. మన శరీరంలో ఇన్సులిన్ స్థాయిని పెరగాలంటే ఖచ్చితంగా మనం తినే ఆహారం బాగా నమిలి మింగాలి.
ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే భోజనం చేసేటప్పుడు టీవీ గాని, మొబైల్ చూస్తూ ఉండటం మానేయాలి. వీటిని చూడటం ద్వారా ఎంత తింటున్నామో అన్న విషయం మరచి పోతారు. దీని ద్వారా ఊబకాయం అనేది చాలా వేగంగా అన్నం తినే వారిలో ఈ సమస్య అధికంగా ఉంది. ఇలాంటి వారు సరైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడమే దీనికి కారణం. ఇలాంటి వారుకొద్దిగా నెమ్మదిగా భోజనం చేసి మీలోతేడాను గుర్తించండి. ఇన్ని అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందాలంటే అన్నం బాగా నమిలి తినడం ఎంతో శ్రేయస్కరం.