తెలుగు టెలివిజన్ రంగంలో అత్యధిక టిఆర్పి రేటింగులు సాధించే షో జబర్దస్త్ కామెడీ షో. ఈ షోలో అన్ని టీమ్ లలో సుడిగాలి సుదీర్, రాంప్రసాద్, శీను కలిసి చేసే స్కిట్స్ కి తిరుగులేని ట్రాక్ రికార్డు ఉంది. టెలివిజన్ లో ఎంత అయితే క్రేజ్ ఉంటదో యూట్యూబ్ లో కూడా ఈ ముగ్గురు చేసే స్కిట్స్ నీ అంతగా నేటిజెన్ లు ఆస్వాదిస్తారు. అయితే ఇటీవల కొద్ది నెలల క్రితం సుధీర్..శ్రీను జబర్దస్త్ షో నుండి వెళ్లిపోవడం జరిగింది. అయితే షో నుండి అనుకోకుండా అర్ధాంతరంగా వెళ్లిపోవడంతో.. షో యాజమాన్యం సుధీర్ కి అన్యాయం చేసిందని బయట రకరకాల కామెంట్స్ వస్తూ ఉండటం జరిగింది. ఇదే సమయంలో కిరాక్ ఆర్పీ కూడా జబర్దస్త్ యాజమాన్యం సుధీర్ కి అన్యాయం చేసింది అన్నట్టు ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు.
తాజా కామెంట్ లపై రాంప్రసాద్, హైపర్ ఆది క్లారిటీ ఇచ్చారు. యాజమాన్యం అవమానించి సుదీర్ ని బయటకు పంపేసింది అన్న వార్తలలో వాస్తవం లేదని తెలిపారు. జబర్దస్త్ షో యాజమాన్యం దగ్గర పనిచేస్తే మిగతా చోట్ల పని చేయకూడదు. అది వాళ్ళ రూల్. అయితే సుధీర్ కి ఆర్థికంగా అవసరం ఉండటంతో జబర్దస్త్ యాజమాన్యంపై గౌరవంతోనే.. ఇక్కడ మానేసి వేరేచోట చేస్తున్నాడు అని రాంప్రసాద్ అది తెలియజేశారు.
సుధీర్ వెళ్లిపోయినంత మాత్రాన జబర్దస్త్ షో రేటింగ్ లు ఏమీ పడలేదు. జబర్దస్త్ యాజమాన్యం ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాలకిస్తారు. మా అందరికీ లైఫ్ ఇచ్చింది జబర్దస్త్ అంటూ హైపర్ ఆది రాంప్రసాద్ తమదైన శైలిలో పేర్కొన్నారు. షో నుండి ఒకరు వెళ్లిపోవటం వల్ల ఏమీ ఒరిగేది ఉండదు. మేమందరం ఒకటే. కెరియర్ పరంగా ఎవరికి వాలు రాణిస్తాం. మా మధ్య పోటీ వాతావరణం కూడా ఉండదు అంటూ ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హైపర్ ఆది ఇంకా ఆటో రాంప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.