Hyundai Creta: ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ప్రతి రంగంలో రోజు రోజుకి కొత్త కొత్త సరుకు మార్కెట్ లోకి వస్తూ ఉంది. మోటార్ వెహికల్ రంగంలో కూడా రోజు రోజుకి కొత్త రకాల బైకులు.. కార్లు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో కార్ రంగం లో ఎన్ని కొత్త కంపెనీలు వచ్చినా గానీ..హ్యుండాయ్ క్రెటాకి ఒక సెపరేట్ మార్కెట్ వుంది. చైనా దేశానికి చెందిన ఈ కార్ల కంపెనీ.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. ఈ కంపెనీ కార్ల తయారీ వినియోగం చైనా, ఇండియా, రష్యా, బ్రెజిల్ అదేవిధంగా ఇండోనేషియా దేశాలలో విస్తరించి ఉంది. ఇంకా హ్యుండాయ్ క్రెటా కార్లకి సంబంధించిన విడిభాగాలు ..కిట్ వారి పర్ట్స్ అల్జీరియా అనే దేశంలో ఉన్న కంపెనీలో తయారవుతాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో మంచి పేరు ఉన్న హ్యుండాయ్ క్రెటా కంపెనీకి తాజాగా ఇండియన్ సుప్రీంకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. మేటర్ లోకి వెళ్తే 2015 ఆగస్టు నెలలో శైలేందర్ భత్ నగర్…హ్యుండాయ్ క్రెటా(1.6 VTVT SX) కంపెనీ కారును కొనుగోలు చేశారు. తన సేఫ్టీ కోసం చూసుకుని కార్ కి ఫ్రంట్ భాగంలో ఎయిర్ బాగ్స్ కలిగి ఉండటంతో కొనుగోలు చేయడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే నవంబర్ 16, 2017వ సంవత్సరంలో… ఈ బండి ప్రమాదానికి గురయింది. ఢిల్లీ -పానిపట్ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురి కావడంతో అదే సమయంలో బండిలో ముందరి భాగంలో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాకపోవడంతో..కారు కొనుగోలు చేసిన యజమాని శైలేందర్ భత్ నగర్ ప్రమాదానికి గురయ్యాడు. మొఖం అదేవిధంగా తలపై బలమైన గాయాలతో హాస్పిటల్ పాలయ్యాడు. అనంతరం కారు యజమాని హ్యుండాయ్ క్రెటాపై ఢిల్లీ స్టేట్ కన్జ్యూమర్ రెడ్రెసాల్ కమిషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కమిషన్ మొత్తం విచారించి హ్యుండాయ్ క్రెటా కంపెనీ ప్రమాదానికి గురైన వ్యక్తికి చికిత్స నిమిత్తం రెండు లక్షలు.. ఇంకా మొత్తంగా మూడు లక్షల జరిమానా.. విధించి కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో హ్యుండాయ్ క్రెటా కంపెనీ “ఢిల్లీ స్టేట్ కన్జ్యూమర్ కోర్ట్” ఇచ్చిన ఆదేశాలను.. “నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెస్సాల్ కమిషన్ (NGDRG) లో చాలెంజ్ చేయడం జరిగింది. అనంతరం చివరాఖరికి ఈ తతంగం మొత్తం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. సుప్రీంకోర్టు లో జస్టిస్ వినీత్ శరణ్, అనిరుద్ధ బోస్ బెంచ్… వాదనలు మొత్తం విని.. కొనుగోలుదారుడు.. కారు కొన్న ప్రారంభంలో తన రక్షణ నిమిత్తం ఎయిర్ బ్యాగ్స్ చూసి కొనుగోలు చేశాడు. కానీ ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాకపోవటం ముమ్మాటికీ కంపెనీ తప్పే. కాబట్టి… ఢిల్లీ స్టేట్ కన్జ్యూమర్ కోర్ట్.. ఇచ్చిన ఆదేశాల ప్రకారం మూడు లక్షలు..ప్రమాదానికి గురైన వాహన కొనుగోలు దారుడు వ్యక్తికి అందించాలని తెలిపింది. ఎయిర్బ్యాగ్లు విఫలమైతే వాటి బాధ్యతను వాహన తయారీదారులపై సుప్రీంకోర్టు విధించడంతో హ్యుందాయ్ క్రెటా యజమానులకు మూడు లక్షలు చేలించాల్సినా పరిస్థితి ఏర్పడింది.