ఐపీఎల్ 25వ లీగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ కెప్టెన్ గా ఉన్నా బెంగళూరు జట్టు 37 పరుగులతో చెన్నై సూపర్ కింగ్స్ చిత్తు చేసింది. వీరిద్దరి మధ్య జరిగిన గత ఏడు మ్యాచ్ లలో బెంగళూరు ఒక్కసారే విజయం సాధించడం గమనార్హం. అయితే నిన్న జరిగిన పోరులో మాత్రం గేమ్ లో మూడవ వంతు బెంగళూరు ధోనీ సేన పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యద్భుతమైన ఇన్నింగ్స్తో 90 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి బెంగళూరు విజయం సాధించడంలో అతి కీలక పాత్ర పోషించాడు.
టాస్ గెలిచిన కోహ్లీ అందరూ ఊహించినట్లుగానే మొదట బ్యాటింగ్ తీసుకున్నాడు. అయితే ఆస్ట్రేలియన్ స్టార్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ మూడవ ఓవర్ లో వెనుదిరిగాడు. ఆ తర్వాత కోహ్లీ, యువ దేవదత్త్ పడిక్కల్ 53 పరుగుల భాగస్వామ్యం ఇచ్చినప్పటికీ ఇన్నింగ్స్ నింపాదిగా సాగింది. అయితే చెన్నై పేసర్ శార్దూల్ ఠాకూర్ ఒకే ఓవర్ లో పడిక్కల్, డివిలియర్స్ లను పెవిలియన్ కు చేర్చడంతో కోహ్లీ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు.
అతనికి శివం దూబే కనీస సహకారం అందించడంతో చివరి డెత్ ఓవర్లలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివరి నాలుగు ఓవర్లలో బెంగళూరు 66 పరుగులు చేసి 170 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ముందు ఉంచింది. కోహ్లీ స్కోర్ చేసిన 90 పరుగులు 50 పరుగుల అతను వికెట్ల మధ్య పెట్టడం విశేషం. తన ఇన్నింగ్స్ లో కేవలం ఐదు బంతులనే ‘డాట్ బాల్స్’ గా ఆడాడు ‘కింగ్ కోహ్లీ’.
ఇక ఈ ఐపీఎల్ లో ఎన్నడూ లేని విధంగా విపరీతంగా తడబడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ లక్ష్యాన్ని ఛేదిస్తుందని ఏ దశలోనూ అనిపించలేదు. మొదటి నుండి ఆర్సిబి బౌలర్లు ధోనీ సేన పై భారీ ఒత్తిడిని తీసుకొని వచ్చారు. ఓపెనర్లు వాట్సాప్, డూప్లెసిస్ పవర్ ప్లే లోపలే వెనుదిరిగారు. ఇక కనీసం రన్ రేట్ ఆరు కూడా లేదు.
అలాంటి సమయంలో అంబటి రాయుడు, జగదీశన్ ఇన్నింగ్స్ ను నిలబెట్టినప్పటికీ ఆశించినంత వేగంతో పరుగులు చేయలేకపోయారు. 15 వ ఓవర్ లో జగదీశన్ వెనుదిరిగిన తర్వాత ధోని చాహల్ ఓవర్లో ఒక 6 కొట్టి అవుటయ్యాడు. దాంతోనే సిఎస్కె ఆశలు ఆవిరైపోయాయి. చివరికి రాయుడు కూడా వెనుదిరగడంతో చెన్నై 20 ఓవర్లలో 132 పరుగులు మాత్రమే చేయగలిగింది.