ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ దాదాపు అన్ని దేశాలకు విస్తరించింది. ఇక బయటకు వెళ్లాలన్నా.. ఏదైనా వస్తువులు ముట్టుకోవాలి అన్నా…. బయట ఫుడ్ తినాలన్నా ప్రజలు వణికిపోతున్నారు. ఇక హైదరాబాద్ వంటి మహానగరాల్లో అయితే పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఇలాంటి సమయంలో గ్రేటర్ హైదరాబాద్ నగర వాసులకు సిసిఎంబి మరో చేదు వార్త తెలిపింది. నగరంలో టెస్టింగ్ కి నోచుకోకుండా బయట పడకుండా ఉన్న కరుణ పేషెంట్లు ఎంత మంది ఉన్నారో లెక్కగట్టి మరీ బయటపెట్టింది. ఆ సంఖ్య చూస్తే ఎవరైనా నోఱు తెరవాల్సిందే మరి.
నగరంలోని మురుగునీటి యంత్రాల నుండి సేకరించిన నీటిలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించామని సిసిఎంబి రాకేష్ కి చెందిన మిశ్రా అన్నారు. ప్రతి మనిషిలో సుమారు 35 రోజుల వరకు కరోనా వైరస్ ఉండే అవకాశం ఉందని… మల, మూత్ర విసర్జన ద్వారా మురుగు నీటిలో కరోనా వైరస్ ఉండవచ్చని రాకేశ్ మిశ్రా తెలిపారు. ఇన్నాళ్లూ కేవలం దగ్గు, తుమ్ముల ద్వారానే ఇది వ్యాపిస్తుందని అందరూ అనుకుంటూ ఉండగా…. ఇప్పుడు మల, మూత్ర విసర్జన ద్వారా కూడా ఇది వస్తుందని సిసిఎంబి షాకింగ్ న్యూస్ వెల్లడించింది.
దీంతో నాలాల లోని మురుగు నీటి ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించింది. సిసిఎంబి, ఐఐసిటి చేసిన పరిశోధనల్లో ఈ విషయం బహిర్గతం అయినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉండగా వారు ఇచ్చిన రిపోర్టులో ప్రకారం దాదాపు ఎంత కాదనుకున్నా నగరంలో 6.6 లక్షల మందికి లేదా ఒక కోటి జనాభాలో 6.6 శాతం మందికి కరోనా వైరస్ ఆల్రెడీ సోకి ఉంటుందని తేల్చి చెప్పారు.