Prabhas: హేతువాది మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని అందరికీ సుపరిచితుడే. సమాజంలో జరిగే అనేక విషయాల గురించి తనదైన శైలిలో స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా బాబు గోగినేని ప్రభాస్ నటించిన “రాధేశ్యామ్” సినిమాపై వైరల్ కామెంట్ చేశారు. డార్లింగ్ ప్రభాస్ తో పాటు డస్కీ సైరాన్… పూజా హెగ్డే హీరో, హీరోయిన్ లుగా నటించిన ఈ పాన్ ఇండియా మూవీ మార్చి 11 వ తారీకు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి… అట్టర్ ఫ్లాప్ అయ్యింది. విడుదలైన ప్రతి చోట నెగిటివ్ టాక్ సొంతం చేసుకుని ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. జ్యోతిష్య నేపథ్యంలో తెరకెక్కడం తో… “రాధేశ్యాం” పై ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. దీనిలో భాగంగా తాజాగా బాబు గోగినేని సినిమా పై ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. “మీరూ మీ అబద్ధాలు !నిజంగా కెప్లర్ ఏం చెప్పాడంటే… జ్యోతిష్యం అనేది గౌరవప్రదమైన, సహేతుకమైన తల్లి ఖగోళశాస్త్రం మూర్ఖపు చిన్న కుమార్తె… బుద్ధి ఉన్నోడు ఎవడన్నా వాట్సప్ చూసి డైలాగులు రాస్తాడా ? తుస్ అంటగా సినిమా… మరేం సినిమా తీసే ముందే చేయి చూపించుకోవాల్సింది విక్రమ్ ఆదిత్యతో” అంటూ “రాధేశ్యామ్” సినిమా యూనిట్ పై సెటైర్లు వేశారు.
బాబు గోగినేని సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్ట్ పై ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు. అది సినిమా. సినిమాను సినిమాలా చూడకండి వేరే కోణంలో చూడొద్దు.. అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత ప్రభాస్ సినిమా రిలీజ్ అయి అట్టర్ ఫ్లాప్ కావడంతో.. అభిమానులు “రాధేశ్యాం” రిజల్ట్ విషయంలో ఇంకా బాధ పడుతున్నారు.