జబర్దస్త్ నుండి నవ్వుల నవాబు గా పేరొందిన నాగబాబు బయటకు వచ్చేసిన తర్వాత అదిరింది షో పైన తను పూర్తిస్థాయిలో దృష్టిని కేంద్రీకరించాడు. అతనికి ‘జీ తెలుగు’ యాజమాన్యంతో ఏమైనా లావాదేవీలు ఉన్నాయేమో తెలియదు కానీ జబర్దస్త్ నుండి నుంచి మంచి లీడర్లను ఇక్కడికి తరలించేందుకు బాగానే ప్రయత్నించాడు. లాక్ డౌన్ విధించడంతో ఈ షో ప్రారంభంలోనే ఆగిపోయింది. అప్పటికే ఇది పెద్దగా క్లిక్ కాలేదు. నవదీప్.. నాగబాబు తో హోస్ట్ గా వచ్చాడు. రవి, సమీరా, భాను శ్రీ లను యాంకర్లుగా క్రేజ్ కోసం ఉపయోగించారు. కానీ ఏవీ పెద్దగా ఫలితం ఇవ్వలేదు.
జబర్దస్త్ నుండి నవ్వుల నవాబు గా పేరొందిన నాగబాబు బయటకు వచ్చేసిన తర్వాత అదిరింది షో పైన తను పూర్తిస్థాయిలో దృష్టిని కేంద్రీకరించా
అయితే లాక్ డౌన్ తర్వాత మరింత క్రేజీ గా ఫార్మాట్ డిజైన్ చేసి జానీ మాస్టర్, సుమ, శ్రీముఖి లతో కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ‘బొమ్మ అదిరింది’ గా తీసుకొచ్చారు. అయితే ఈ షో లో తాజగా ప్రోమో లో కమెడియన్స్.. హీరో రాజశేఖర్, వైఎస్ జగన్, బాలకృష్ణ పై సెటైర్లు వేయడం కనిపించింది. అయితే దీనిని భారీగా వ్యతిరేకించే వర్గం కూడా ఉంది. విషయం ఏమిటంటే నాగబాబు ఇప్పటికే తన ‘నా ఛానల్ నా ఇష్టం’ లో తనకు నచ్చిన వారందరికీ ఉద్దేశించి ఎన్నో స్పీచ్ లు ఇవ్వడం మొదలు పెట్టేసాడు. అయితే ఫన్ అండ్ ఎంటెర్టైన్మెంట్ కోసం చూసే ప్రోగ్రామ్ లో జనాలకు తన సొంత భావాలను ఆపాదిస్తున్నడు అనే అభిప్రాయం ఇప్పుడు జనాల్లోకి వచ్చేసిందట.
హీరో రాజశేఖర్ మొన్న ఈ మధ్యనే ‘మా అసోసియేషన్’ లో చిరంజీవి మాటలను గౌరవించకుండా మాట్లాడాడు. అది మెగాస్టార్ కూడా కోపం తెప్పించింది. ఇక వైయస్ జగన్ రాజకీయంగా నాగబాబు ప్రత్యర్థి. బాలకృష్ణకు, నాగబాబుకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే వీరు ముగ్గురు పై కమెడియన్ లను ఉపయోగించి సెటైర్లు వేయడం అనేది డైరెక్టర్లు, టీం లీడర్ లో కలిసి తీసుకున్న నిర్ణయమా లేదా నాగబాబు పాత్ర, ప్రమేయం ఏమైనా ఉందా అనే అనుమానాలు బాగా మొదలైపోయాయి.
అయితే చాలా మంది దీనిలో నాగబాబు ప్రమేయం, పాత్ర ఏమి ఉండదని కేవలం కామెడీని ఎంజాయ్ చేసి ప్రమోషన్ ఇస్తాడు అని అంటున్నారు. మీకు తెలియనివి ఈ షో గురించి చాలా ఉన్నాయి కేవలం నాగబాబు ని తప్పుబట్టడం చాలా ఉన్నాయి అనే వాదనలూ బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఈ విమర్శలు నాగబాబు వరకు వెళితే కానీ అతను స్పందించి మనకు ఫుల్ క్లారిటీ ఇచ్చేయడు.