Thaman: టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ చలామణి అవుతున్న సంగతి తెలిసిందే. “అలా వైకుంఠపురం లో” సినిమా సాంగ్స్ నుండి.. తమన్ వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఇటీవలే బాలయ్య బాబు సినిమా “అఖండ” కి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. గతంలో తమన్ అందించిన మ్యూజిక్ కి ప్రస్తుతం అందిస్తున్న మ్యూజిక్ కి చాలా తేడా కనబడుతుంది. తమన్ తన టీమ్ లో మార్పులు చేసినట్లు.. కొత్తగా వచ్చిన టీం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇన్ కార్టూన్స్ అందించడంలో నెక్స్ట్ లెవెల్ లో పని చేస్తున్నట్లు టాక్.
ఇదిలా ఉంటే చేతినిండా సినిమాలతో బిజీగా కెరీర్ కొనసాగిస్తున్న తమన్.. ఓ ప్రముఖ రియాల్టీ షోకి జడ్జిగా వ్యవహరించిన ఉన్నట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే తెలుగు ఇండియన్ ఐడిల్ షోకి తమన్… జడ్జిగా వ్యవహరింనున్నట్లు సమాచారం. ఆహా ఓటిటి లో ఈ షో ప్రసారం కానుందట. హోస్ట్ గా సింగర్ శ్రీరామ్ చంద్ర వ్యవహరించనున్నారు. ఇక ఇదే సమయంలో తమన్ తో పాటు సింగర్ కార్తిక్… హీరోయిన్ నిత్యామీనన్ ఈషో కి.. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించ నున్నారట.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ షోని ఆహా నిర్వాహకులు చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ ఐడల్ సీజన్ ఫైవ్ వీనర్ గా నిలిచిన బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ రామచంద్ర..ఈ షోకి హోస్ట్ గా .. చేయటానికి భారీ రెమ్యూనరేషన్ కూడా అందుకు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ షో కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నట్లు సమాచారం.