(న్యూస్ అర్బిట్ డెస్క్)
లండన్లో విజయ్ మాల్యాను చోర్ చోర్ అంటూ భారతీయులు ఘోరావ్ చేసి పరాభవం చేశారు. భారతీయ క్రికెట్ అభిమానులు మాల్యాకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆయన ఖంగుతిన్నారు. భారత్లో బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి లండన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా ఓవల్ మైదానంలో భారత్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ మ్యాచ్లో ప్రత్యక్షమయ్యాడు.
మ్యాచ్ చూడటానికి వచ్చిన భారతీయులు ఆయన్ను గమనించి వెంటనే ‘మాల్యా చోర్ హైహ్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ పరిణామంతో మాల్యా అక్కడ నుండి మెల్లిగా జారుకున్నారు.
భారత్లోని బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన కేసులో మాల్యా విచారణ ఎదుర్కొంటున్నారు.
వీడియో కోసం కింద క్లిక్ చేయండి