(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
రోడ్డుపై పంది పిల్లలు కనిపిస్తే కుక్కలు తరుముతుంటాయి. గుంపులు గుంపులుగా వెంటబడి వెళ్లగొడతాయి. కానీ గుంటూరు జిల్లా దాచేపల్లి పట్టణంలో ఓ వింత చోటు చేసుకుంది. ఓ కుక్క ఒక పంది పిల్లకు తానే తల్లై పాలిచ్చి మాతృ ప్రేమను చూపించింది. ఆకలితో ఉన్న పందిపిల్లకు శునకం పాలిచ్చింది. చనుబాల కోసం వచ్చిన పందికి అక్కడే నిలబడి పాలిచ్చింది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. కలియుగంలో మనుషుల మధ్య మానవతా విలువలు మంటగలసిపోతున్న తరుణంలో కుక్క ఒక పంది పిల్లపై చూపించిన మాతృ ప్రేమపై నెటిజన్లు ఆశ్చర్యం వక్యం చేస్తున్నారు. ఏమాత్రం జంతు బేధం చూపని మూగ జీవుల మనసును చూసి కామెంట్లు చేస్తున్నారు. జాతులు వేరైనా ఆకలి ఒకటేగా అంటూ సదరు వీడియోను తిరిగి షేర్స్ చేస్తున్నారు.
https://youtu.be/LJOIxV5rr9M
video courtesy: News 18