(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఆర్మీ కాంటిన్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తున్న ఏనుగుకు ఓ జవాన్ మంట చూపడంతో పలాయనం చిత్తగించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
భూటాన్ సరిహద్దుకు 15 కిలో మీటర్ల దూరంలో పశ్చిమ బెంగాల్ హసిమరా ప్రాంతంలోని ఆర్మీ కాంటిన్లోకి ఒక్క సారిగా ఏనుగు వచ్చింది. డైనింగ్ హాలులో ఉన్న టేబుల్స్ అన్నీ చెల్లాచెదురుగా నెట్టింది. కిచెన్లోకి దూసుకువెళ్లే ప్రయత్నం చేయగా ఒక వ్యక్తి పేపరుకు నిప్పు అంటించి దాన్ని తరిమివేయాలని చూసినా అది ముందుకు దూసుకువచ్చింది. ఇంతలో అర్మీ జవాను కర్రకు మంట అంటించి దాని మీదకు వెళ్లకు పరుగు లంకించుకుంది.
మంటను చూసి ఏనుగు పరుగు పెడుతున్న ఈ వీడియోను అనన్య భట్టాచార్య సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
From back home today. The jumbo just walked into the Hashimara Army Canteen… and it was complete madness. pic.twitter.com/4v8sgPjSbh
— Ananya Bhattacharya (@ananya116) November 30, 2019