(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మనుషుల లాగే జంతువులు కూడా తెలివి ప్రదర్శిస్తున్నాయి. తాజాగా ఓ ఏనుగు చేసిన పని అందరినీ ఆశ్చర్య పరిచింది. వివరాల్లోకి వెళితే.. పోలంలోకి వెళ్తున్న ఓ ఏనుగుకు కరెంటు తీగల కంచె అడ్డుపడింది. దానిని ముట్టుకుంటే చచ్చిపోతానని అది పసిగట్టింది. ఏం చేయాలో దానికి అర్ధమైపోయింది. తనకు అడ్డుగా ఉన్న కరెంట్ పోల్ను తొండంతో జాగ్రత్తగా కిందకు వంచేసింది. ఏనుగు తన తొండంతో తీసిన కంచెకు విద్యుత్ సరఫరా వైర్లు ఉన్నాయి. ఆ విద్యుత్ తీగలను తాకకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తూ అవతలి వైపునకు వెళ్లిపోయింది. ఏనుగుకు సంబంధించిన ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నందా ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఏనుగు కాస్త తెలివిగల జంతువు అన్న పేరైతే ఉంది. తాజాగా ఈ ఏనుగు చేసిన చర్యతో అది నిజమే అని అనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Elephants will go where they want. Solar electric fencing maintained at 5kv was designed to deter them. It’s intelligence makes them cleaver to breach that barrier. Interesting. pic.twitter.com/vbgcGTZfij
— Susanta Nanda IFS (@susantananda3) November 4, 2019