(న్యూస్ ఆర్భిట్ డెస్క్)
దళిత యవకుడిని ప్రేమించి వివాహం చేసుకున్న ఓ యువతి తనకు ప్రాణహని ఉందంటూ పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
యూపీలోని బరేలీ బిజెపి ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా కుమార్తె సాక్షి మిశ్రా (23) గత గురువారం దళిత సామాజిక వర్గానికి చెందిన అజితేశ్ కుమార్ (29)ను ప్రేమ వివాహం చేసుకుంది.
ప్రయాగ్రాజ్లోని ఒక ఆలయంలో వీరు పెళ్లి చేసుకున్నారు. నాటి నుంచి వీరిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన తండ్రి, ఆయన అనుచరుల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తున్నది.
తమకు రక్షణ కల్పించాలని అలహాబాద్ హైకోర్టునూ ఆశ్రయించింది. ఆమె తండ్రిని ఉద్దేశిస్తూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.