(ఫోటోలు, వీడియో ఎఎన్ఐ సౌజన్యంతో)
రాయ్బరేలీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గురువారం కొద్దిసేపు పాములు ఆడించే వాడితో మాట్లాడి అతని కష్టసుఖాలు తెలుసుకోవడంతో పాటు పాములను ధైర్యంగా పట్టుకొని అక్కడ ఉన్న వారందనీ ఆశ్చర్యపరిచారు.
ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలిలో తన తల్లి సోనియా గాంధీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రియాంక గాంధీ అక్కడి ప్రజలతో మమేకం అవుతున్నారు. అక్కడి వారు చేస్తున్న పనుల్లో పాలుపంచుకుంటూ వారితో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు.
గురువారం పాములు పట్టే వారు ప్రియాంకకు తారసపడ్డారు. వెంటనే వాళ్ల వద్ద కూర్చుని బుట్టలో పాములను చూపించాలని కోరారు. అవి ప్రమాదకరమైన పాములని అక్కడ ఉన్న అభిమానులు వారించారు. ఏమి కాదులే అంటూ పామును చేతిలో పట్టుకొని పరిశీలిస్తూ ఇంకా ఎలాంటి రకాల పాములు ఉన్నాయో చూపించాలని అడిగారు. అక్కడ ఉన్న ప్రజలు భయపడుతున్నప్పటికీ ప్రియాంక ధైర్యంగా చేతితో పామును పట్టుకొని ఆందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు ప్రియాంక ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.
#WATCH Priyanka Gandhi Vadra, Congress General Secretary for Uttar Pradesh (East) meets snake charmers in Raebareli, holds snakes in hands. pic.twitter.com/uTY0R2BtEP
— ANI UP (@ANINewsUP) May 2, 2019