పాట్నా: బిహార్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడ తెరిపిలేకుండా వర్షాలతో పాట్నాలోని పలు రోడ్లు చెరవులను తలపిస్తున్నాయి. జనావాసాల్లో కాలనీలు నీట మునిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువతి రోడ్డుపై ఫొటో షూట్ జరిపారు. రోడ్డుపై నిలిచిన నీళ్ల మధ్యకు వెళ్లి ఫొటోలు దిగారు. నిఫ్ట్ విద్యార్థిని అదితి సింగ్ పాట్నాలో వరదనీటితో నిండిన రోడ్డుపైకి కారులో వచ్చింది. ఫొటోగ్రాఫర్ చేతిలో గొడుగు పట్టుకుని మరి ఆమె ఫొటోలను తీశారు. దీనిని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
https://youtu.be/RcAvCDM77Eg
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫొటో షూట్కు పది వేల లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం పట్నాలో ఉన్న పరిస్థితిని ప్రజలకు చూపించేందుకు తాము ఇలా చేశామని ఫొటో షూట్ జరిపిన వారు తెలిపారు. అయితే ఈ ఫొటో షూట్ను కొందరు అభినందిస్తుంటే.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు.
https://www.instagram.com/p/B28OKTtDOb9/?utm_source=ig_embed
https://www.instagram.com/p/B28OB0ODkEB/?utm_source=ig_embed