ఆగష్టు 1న ప్రతి నెలలానే పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. రూ.1478.90 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగష్టు నెల నుండి కొత్తగా 2,20,385 మంది పెన్షన్ ద్వారా లబ్ది పొందనున్నారు.
మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 61.28 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్లు అధికారిక సమాచారం. వీరిలో 1568 హెల్త్ పెన్షన్లు కూడా ఉన్నాయి. ఈ మొత్తం పెన్షన్లు నేరుగా లబ్ధిదారుల చేతికే పెన్షన్లు చేరనున్నాయి. ఇందుకోసం 2.68 లక్షల మంది వాలంటీర్లు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కరోనా కారణంగా బయోమెట్రిక్ బదులుగా జియో ట్యాగింగ్ ఫోటోలు వాడనున్నారు. అలాగే బ్రాహ్మిన్ కార్పోరేషన్ ద్వారా ఇచ్చే పెన్షన్ల మొత్తాన్ని పెంచుతున్నారు. వైయస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా వీరికి పెన్షన్ అందనుంది.