రక్తంలో ఉండే మలినాల వల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొటిమలు, మచ్చలు, చర్మం పొడి బారడంలాంటి సమస్యలు వస్తాయి. రక్తం శుద్ది అయితే చాలా రకాల అనారోగ్యాల నుంచి తప్పించుకోవొచ్చు.
మన శరీర భాగాల్లోని రక్తం ఊపరితిత్తుల్లో శుభ్రపడుతుంది. రక్తంలోని మలినాలను మూత్రపిండాలు వడపోస్తాయి. ఊపిరి తీత్తులు గాలిలోని ఆక్సిజన్ను గ్రహించి రక్తం ద్వారా శరీర భాగాలకుఅందిస్తుంది. అయితే శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేయడం మన అలవాట్లతోనే సాధ్యం అవుతుంది. దానిగురించి తెలుసుకుందాం.
మునగాకు, కందిపప్పు, కోడిగుడ్డు, కొద్ది పరిమాణంలో నెయ్యి తీసుకుంటే శరీరంలో రక్తం శుభ్రపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. రోజూ కనీసం కచ్చితం గా ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి.
అల్లంరసంలో కాస్త తేనె కలిపి తీసుకుంటే రక్తంలోని మలినాలు బయటకు పంపబడతాయి .
ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి ఎక్కువగా ఉండే జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో కొత్త కణాల తయరు చేసే పనికి వెల్లుల్లిఉపయోగపడుతుంది.
రోజూ క్రమం తప్పకుండా వ్యాయమం చేస్తే రక్తంలోని మలినాలు చెమట రూపంలో బయటకు పంపబడతాయి.
వారానికి కనీసం రెండు, మూడు సార్లు బీట్రూట్ను తీసుకుంటే శరీరంలో రక్తం ఉత్పత్తి పెరుగుతుంది.
నీటిలో కాస్త సోంపు కలిపి తాగితే రక్తంలో కొవ్వు పరిమాణం తగ్గడమే కాదు, అధిక బరువును నియంత్రిస్తుంది.
రాత్రిపూట నిద్రపోవడానికి కనీసం రెండు, మూడు గంటలకు ముందు ఆహారాన్ని తీసుకుంటే రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. రోజూ కనీసం ఒక అరగంట నడిస్తే క్యాలరీ తగ్గి, శరీరంలోని విషతుల్యాలు చెమట రూపంలో బయటకు పోతాయి. ఫలితంగా రక్త ప్రసరణ వ్యవస్త మెరుగుపడుతుంది.