మనం రోజు ఆహారంలో వాడే రక రకా ల పదార్థాలు మనకు తెలియకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి .పాలు, పసుపు, ఆకుకూరలు, క్యారెట్,మొదలైన పదార్థాలలో ఎన్నో విటమిన్లు ఉంటాయి.అంతేకాకుండా నెయ్యి, జీలకర్ర, మిరియాలు, మెంతులు, పచ్చిమిర్చి ఇవి కూడా ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగ పడతాయి . రోగ నిరోధక శక్తి పెరగాలంటే మన ఇంట్లో పదార్ధాలు ఉపయోగ పడతాయి. తాంబూల వేసుకోవడమనేది శరీరానికి ఉపయోగకరమైనది.ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఎ విటమిన్,సి.విటమిన్ ల ను తమలపాకు ఎక్కువగా కలిగి ఉంది . తాంబూలం రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది.
వేరుశెనగ పప్పును బెల్లం పాకం లో కలిపి చేసే దాన్ని వేరుశెనగ పట్టి లేదా చిక్కి అంటారు. వేరుశెనగపప్పు, బెల్లం ఈ రెండుఎన్నో పోషకాలు కలిగి ఉన్నాయి. వేరుశెనగపప్పులో పొటాషియం, క్యాల్షియం, విటమిన్ బి, ఫాస్పరస్ ఉంటాయి. అవి శరీరంలో రక్తం, గ్లూకోజ్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తాయి.
బెల్లం వల్ల శరీరం నుంచి వ్యర్ధపదార్ధాలుబయటికి పోతాయి. బెల్లంలో జింక్, సెలీనియం వంటి మినరల్స్ కూడా ఉంటాయి. బెల్లం మామూలుగా గడ్డలాగా ఉంటే ఎక్కువమంది తినడానికి ఇష్టపడరు కాబట్టి వేరుశెనగ పట్టి రూపంలో బెల్లం ఇంకా పల్లీలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఇవి 10 నుండి 20 రోజుల వరకు తరచుగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా నాలుగు సంవత్సరాల నుండి వయ్యస్సు పైబడిన వాళ్ళవరకు ఎవ్వరైనా తినొచ్చు. ఇది రోగనిరోధక శక్తి ని బాగా పెంచుతుంది.
వ్యాధినిరోధక శక్తి పెంచడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. వెల్లుల్లీలో విటమిన్ ఏ,జింక్, సల్ఫర్, సెలీనియమ్,పుష్కలంగా ఉంటాయి.. ఇది యాంటీ ఫంగల్ మరియు క్రిమినాశక కారి . నిమ్మకాయలో అధికంగా లభించే విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జామపండులో అత్యధికంగా విటమిన్ సి, పోటాషియం ఉంటాయి. దీని ద్వారా యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి తగినంత లభిస్తాయి. వీటిని తినటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి మనిషి ఉల్లాసంకలుగుతుంది. ఖరీదైన మందుల తో కూడా తగ్గించలేని ఎన్నో అనారోగ్య సమస్యల్ని ఒక చిన్న అల్లం ముక్క తో నయం అవుతుంది . అల్లం టీ రోగ నిరోధక శక్తిని పెంచడంలో బాగా పనిచేస్తుంది.
కాబట్టి దీన్ని తరచుగా తీసుకోవాలి. ఈ టీ తీసుకుంటే ఎలాంటి సమస్యలు దరిచేరవు. ఇన్ఫెక్షన్లను అడ్డుకుని ఎలాంటి ఆరోగ్య సమస్యలు కలగకుండా చూస్తుంది.వీటితో పాటు ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలపాటు వాకింగ్ లేదా వ్యాయామం చేయండి.దీనివల్లకూడా మేలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతి మనిషికి 8 గంటల పాటు నిద్ర పోవడంఅనేది చాలఅవసరం. రాత్రిపూట ఆరు గంటల కన్నా తక్కువగా నిద్రపోయేవారు – ఏడు గంటల కన్నా ఎక్కువగా నిద్ర పోయిన వారితో పోలిస్తే తక్కువగా నిద్రపోయే వారిలో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉంది.
దీనితో వారికీ అనేక ఇంఫెక్షన్ ల బారిన పడుతున్నారని తెలుస్తుంది..సరిపడినంత నిద్ర అనేది మనిషికి ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.ఉత్సహాని ఇస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.