స్థలమేమో ఆక్రమణ..! వివాదమేమో కోర్టులో..! తాత్కాలికంగా స్టే వస్తే వచ్చింది. కానీ గీతంకి ముందుంది అసలైన దసరా పండగ..! గీతం ఇష్యూ ఇప్పుడు నడుస్తుంది. రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్..! కేవలం స్థలాలు ఆక్రమించుకుని, భవనాలు కట్టేశారు అనేది ఆరోపణ కానీ, లోపలికి వెళ్తే ఈ కోర్సుల అనుమతులు, జాతీయ సాంకేతిక విద్యామండలి నిబంధనలు ఓ సారి చూడాల్సిందే..!
స్టే వరకు ఓకే.. కానీ..!
దాదాపు 40 ఎకరాలు భూమిని గీతం ఆక్రమించింది అనేది ఆరోపణ. ప్రభుత్వ అధికారులు జేసీబీ తీసుకెళ్లి.., కూల్చేయడం.., వెంటనే ఆ యూనివర్సిటీ పెద్దలు కోర్టుకి వెళ్లడం.., హైకోర్టులో నిన్న రాత్రి గీతం యూనివర్సిటీకి ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చర్యలు నిలుపుదల చేయాలంటూ కోర్టు ఆదేశించింది. ఇక్కడ బాగా గుర్తించాల్సిన అంశాలున్నాయి. గీతం ఆ భూములను తాము ఆక్రమించలేదని.., అవి తమవేనని ఎక్కడా చెప్పడం లేదు. కేవలం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని.., క్రమబద్ధీకరణ కోసం పెట్టుకున్న దరఖాస్తు పెండింగ్ లో ఉందని చెప్తున్నారు. అంటే ఆ భూమి వారికి నిబంధనలు ప్రకారం రాలేదు అనేది, ఒకరకంగా ఆ భూమి వారిది కాదనేది స్పష్టం.
Reas Also >> గీతం అనుమతులకు ఎసరు..!? “న్యూస్ ఆర్బిట్” ముందే చెప్పింది..!!
జాతీయ సాంకేతిక విద్యామండలి ఏం చెప్తుంది..!
ఒక యూనివర్సిటీకి అనుమతులు ఇవ్వాలి అంటే.. ఆ భూములు, భవనాలు ఆ యూనివర్సిటీ పేరిట ఉన్నాయా లేదా? అనేది ప్రాథమిక నిబంధన. అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే మొదటగా జరిగే ప్రక్రియ ఇదే. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నడిచే సాంకేతిక విద్యామండలి అధికారులు వచ్చి.. ఆ భవనాలు, భూములకు సంబంధించిన పత్రాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి, స్థానిక అధికారులతో కూడా మాట్లాడి, అభ్యంతరాలు లేని పక్షంలో మాత్రమే అనుమతులు ఇస్తారు. అంటే గీతం విషయంలో నాడు పరిశీలన ఎలా జరిగింది..!? ఏం జరిగింది..? ఏ అంశం ఇప్పుడు తెరపైకి వచ్చే వీలుంది. అదే వస్తే మూలల్లోకి వెళ్లి, పునఃపరిశీలన చేసి.., ఆ గొడవలు కారణంగా కోర్సులు , ఏకంగా యూనివర్సిటీ అనుమతులు రద్దు చేసే అవకాశం లేకపోలేదు. ఇక్కడ మనం రాజకీయ అంశాన్ని వదిలేయకూడదు. గీతంని ఇక్కడ వరకు తీసుకొచ్చిన సీఎం జగన్ కి ఆ పని కూడా చేయడం పెద్ద పనేం కాదు..! అందుకే గీతంగోవిందమే..!!