కర్నూలు, మార్చి 4 : కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి టిడిపికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి, పదవికి రాజీమానా చేస్తున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబుకు సోమవారం పంపిన లేఖలో పేర్కొన్నారు.
ఆయన కర్నూలు జిల్లాలో ఏదైనా అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
పార్టీ మారే అంశంపై ఇప్పటికే తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల ఎనిమిదిన వైసిపి అధినేత జగన్మోహనరెడ్డితో సమావేశం అయి పార్టీలో చేరనున్నట్లు తెలుస్తున్నది.
చల్లా రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి కర్నూలు జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఒక పర్యాయం, కోయలకుంట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి పిఆర్పి అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.