NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Mp: ‘ఎంపీ’లో టెన్షన్ మొదలైందా..? స్పీకర్ ని కలిసింది అందుకేనా..?

mp tension over cm jagan delhi tour

Mp Raghuramakrishna Raju: ఎంపీ రఘురామకృష్ణ రాజు Mp Raghuramakrishna Raju లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తనపై అనర్హత వేటు వేయొద్దని కోరారు. దీని వెనుక ఓ కారణం ఉంది. ఇటివల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. సీఎం జగన్ పర్యటన అనంతరం ఎంపీ మార్గాని భరత్ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రఘురామపై అనర్హత వేటు వేయాలని లిఖితపూర్వకంగా కోరారు. దీనిపై రఘురామ స్పందిస్తూ ఇప్పటికి 4-5 సార్లు లేఖ ఇచ్చారు. నాపై వేటు వేయడం అంత ఈజీ కాదనే స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. కానీ.. స్పీకర్ ను కలిసి లేఖను పరిగణలోకి తీసుకోవద్దని కోరారు. అంటే.. ఆయనలో ఏమూలో జంకు ఉండబట్టే స్పీకర్ ను కలిశారని చెప్పాలి.

mp tension over cm jagan delhi tour
mp tension over cm jagan delhi tour

ఢిల్లీలోనే మకాం వేసుకున్న రఘరామకు అక్కడే ఉండే పెద్దలను కలవడం ఎంపీగా చాలా తేలిక. ఈ ధైర్యంతోనే భరత్ ఇచ్చిన లేఖను తేలిగ్గానే తీసిపారేశారు. పైగా.. కేంద్ర మంత్రులతో సీఎం జగన్ భేటీలో రాష్ట్ర సమస్యలతోపాటు తన అంశంపై కూడా హోంమంత్రి అమిత్ షాతో చర్చించి ఉంటారని ఆయనకు ప్రత్యేకంగా తెలియాల్సిన అవసరం లేదు. అందుకే ఆ లేఖపై అలా స్పందించారు. తోటి ఎంపీలను, కేంద్ర మంత్రులను కలుస్తూ ఏపీ సీఎంపై, రాష్ట్ర ప్రభుత్వ తీరు, సీఐడీ తీరుపై కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నారు. ఎంపీగా నియోజకవర్గానికి ఏం చేశారనే ఆలోచన కేంత్ర ప్రభుత్వ పెద్దలకు ఒకరు చెప్పాల్సిన పని లేదు. నియోజకవర్గంలో భద్రత లేదనే వై కేటగిరీ భద్రత తెచ్చుకున్నారు కానీ.. ఢిల్లీలో ఉంటున్నందుకు కాదు.

Read More: Telangana Congress: టీపీసీసీ చీఫ్ ఎంపిక..! అధిష్టానం ఆలోచిస్తోందా.. భయపడుతోందా..?

అంత భద్రత ఉన్నా నర్సాపురంలో అడుగుపెట్టింది లేదు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే స్పీకర్ ఆయనపై చర్య తీసుకుంటారో లేదో ఆయనకూ తెలుసు. నిజంగా.. తనపై అనర్హత వేటు వేయలేరంటే స్పీకర్ ను కలవాల్సిన అవసరం లేదు. కాబట్టి.. కొంత అభద్రతలోనే ఉన్నారనే చెప్పాలి. ఏదేమైనా.. రఘురామ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరే. సీఎం జగన్ పై సీబీఐ కేసుల విచారణ ఆయనకు అవసరం లేనివి. అయినా పిటిషన్ వేశారంటే వ్యక్తిగతంగా వెళ్తున్నట్టే. మరి.. ఓట్లేసిన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి చూడకుండా కేవలం తనను తాను కాపాడుకుంటూ.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే స్పీకర్ చూస్తూ ఉరుకుంటారా..? ఏమో చూద్దాం..!

 

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju