Food: బయట దొరికే చిరుతిళ్లు తినడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.. అయితే వీటిని తినడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది.. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్స్ తీసుకుంటే త్వరగా మరణం సంభవించవచ్చు అంటున్నారు పరిశోధకులు..!? దీనికి సంబంధించిన పూర్తి విషయాలు ఇలా ఉన్నాయి..!!
పిజ్జా, బర్గర్, బ్యాకరీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, చిప్స్, జంక్ ఫుడ్ తినడం వలన ప్రజలు ఎలాంటి రోగాల బారిన పడుతున్నారు..!? ఏ వయసులో చనిపోతున్నారు..!? అనే విషయంపై అమెరికా యూరప్ లలో 44,551 మందిని పర్యవేక్షించారు. నిత్యం తీసుకునే ఆహారం, ఇతర అలవాట్లు, నిద్రపోయే సమయం, వారికి ఉన్న అనారోగ్య సమస్యలు తదితర వివరాలను పరిశీలించారు. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినే వారు త్వరగా చనిపోతారాని తేలింది. ఆ ఫుడ్ తినని వారితో పోలిస్తే తినే వారిలో 14 శాతం వరకు చనిపోయే అవకాశాలు ఉన్నాయి.
ప్రాసెస్ ఫుడ్ వలన క్యాన్సర్ వంటి వ్యాధులు రావడం ఖాయమని చెబుతున్నారు. పెద్దపేగు క్యాన్సర్ తో పాటు గుండె సంబంధిత సమస్యలు గుండె పోటు, డయాబెటిస్ వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకింగ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ రోజు తీసుకోవడం వలన మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా పరిశోధనలో తేలింది. అందువలన వీటిని పూర్తిగా తినడం మానేయాలి. లేదంటే ఎప్పుడో ఒకసారి తాగడం ఉత్తమం.